Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

“ప్రజలకు గౌరవం.. నేరస్తులకు కఠిన చర్యలు” – డీజీపీ సీవీ ఆనంద్

Published

on

తెలంగాణలో మావోయిజం అంతమైందని ప్రకటన.. గ్రేహౌండ్స్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ

హైదరాబాద్, జూన్ 10:

తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలను గౌరవిస్తామని, అయితే రౌడీలు, గుండాలు, నేరగాళ్ల పట్ల ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.

తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా అంతమయ్యాయని పేర్కొన్న డీజీపీ, ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నామని వెల్లడించారు. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న సుమారు 1,700 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసి వారి సేవలను వినియోగించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాలు ప్రస్తుతం పోలీసు శాఖకు అతిపెద్ద సవాల్‌గా మారాయని, వాటి నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించిన డీజీపీ, ప్రజల సహకారంతో నేర నియంత్రణలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

అరైవ్ అలైవ్ కార్యక్రమానికి హాజరైన ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్

Published

on

జనగామలో ఘన స్వాగతం.. గౌరవ వందనంతో ఆహ్వానించిన పోలీసులు

జనగామ, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి గ్రేహౌండ్స్, ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సన్ ప్రీత్ సింగ్ డీజీపీ అనిల్ కుమార్‌కు పూల మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమం ప్రాధాన్యతను అధికారులు వివరించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం

Published

on

జగిత్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏబీ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జిల్లా స్థాయి ఉపసర్పంచ్‌ల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపసర్పంచ్‌ల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

సమావేశంలో ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ ఉపసర్పంచ్ మేరుగు జంపన్న (జానీ)ను ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, ఉపసర్పంచ్‌లు అభినందనలు తెలిపారు.

 

జిల్లాలోని అన్ని మండలాల నుంచి పూర్తి స్థాయిలో ఉపసర్పంచ్‌లు హాజరు కాలేకపోవడంతో తాత్కాలిక జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు మేరుగు జంపన్న తెలిపారు. జిల్లా కన్వీనర్‌గా ముత్యాల స్వామి, కో-కన్వీనర్‌గా గురిజాల బుచ్చిరెడ్డి, కన్వీనర్‌లుగా జంగ్ లావణ్య శ్రీనివాస్, గుర్రపు తిరుపతి, సింహరాజు క్రాంతి, కందరి ముత్యపురెడ్డిలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధిలో ఉపసర్పంచ్‌ల పాత్ర, సంఘ బలోపేతంపై చర్చించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు కటుకం స్వప్న, రాష్ట్ర నాయకుడు ఎండీ రఫీ తదితరులు పాల్గొని ఉపసర్పంచ్‌ల ఐక్యతతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Continue Reading

crime

లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్.. గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం

Published

on

బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసుల వివరాల ప్రకారం, జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, రెండు డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో 20 మోటార్‌సైకిళ్లు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు.

 

ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

 

కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending