Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Entertainment

నేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం

Published

on

తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం

ఉత్కంఠకు తెర.. సీఎం పీఠంపై ‘దళపతి’ విజయ్

చెన్నై, బిబిఎంఏ న్యూస్:

తమిళనాడు రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా సాగిన ఉత్కంఠభరిత పరిణామాలకు శనివారం ఎండ్‌కార్డ్ పడింది. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ‘దళపతి’ విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అధికార పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్‌ను అధికారికంగా ఆహ్వానించారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఐదు రోజుల రాజకీయ హైడ్రామాకు ముగింపు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీకి కొన్ని స్థానాలు తక్కువ రావడంతో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విజయ్ వరుసగా మిత్రపక్షాలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ఐయూఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సేకరించి గవర్నర్‌కు సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉన్న అన్ని అనుమానాలకు తెరపడింది.

సంఖ్యా బలం ఎలా మారింది?

234 స్థానాల తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో పార్టీ బలం 107కు తగ్గింది. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేలు, వామపక్షాల ఎమ్మెల్యేలు, వీసీకే సభ్యులు మద్దతు ప్రకటించారు. చివరి క్షణంలో ఐయూఎంఎల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కు మద్దతు తెలపడంతో మొత్తం సంఖ్య 120కు చేరింది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖరారైంది.

కాంగ్రెస్‌కు పెద్దపీట

కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి విశేష ప్రాధాన్యం దక్కనుంది. మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారడంతో కేబినెట్‌లో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని టీవీకే నిర్ణయించినట్లు సమాచారం. ఇది తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్‌కు కొత్త ఊపునిచ్చే అంశంగా భావిస్తున్నారు.

తొలి కేబినెట్‌లో ఎవరికెవరికీ అవకాశం?

విజయ్‌తో పాటు తొలి విడతలో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెంగోట్టియన్, ఆధవ్ అర్జున్, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్ తదితరులకు మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి.

సినీ స్టార్ నుంచి సీఎం వరకూ విజయ్ ప్రయాణం

తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన విజయ్ గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దగ్గరయ్యారు. యువత, మధ్యతరగతి, అభిమాన వర్గాల మద్దతును రాజకీయ శక్తిగా మలచడంలో విజయవంతమయ్యారు. అవినీతి వ్యతిరేక నినాదాలు, యువతకు ఉద్యోగాలు, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లిన విజయ్ ఈ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించారు.

డీఎంకే – అన్నాడీఎంకేలకు భారీ షాక్

దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసించిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ఈ ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. సినీ ఇమేజ్‌ను రాజకీయ ఓట్లుగా మార్చుకుంటూ విజయ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ముందున్న సవాళ్లు

ప్రభుత్వం ఏర్పాటు దిశగా విజయ్ విజయవంతమైనప్పటికీ అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభమవుతోంది. మిత్రపక్షాల సమన్వయం, ఎన్నికల హామీల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలు కొత్త ప్రభుత్వానికి ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి. మరోవైపు మూడు రోజులలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉండటంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా చర్చ

సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళ రాజకీయాల్లో మరో సినీ శకం ప్రారంభమైందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

ఘనంగా ‘రీ-బర్త్’ హీరోయిన్ శ్రీలత నేత జన్మదిన వేడుకలు

Published

on

జూలై 18:గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో అసవి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత అశోక్ వేముల నిర్మిస్తున్న సందేశాత్మక చిత్రం ‘రీ-బర్త్’ షూటింగ్ సందర్భంగా హీరోయిన్ శ్రీలత నేత జన్మదిన వేడుకలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. దర్శకుడు కొత్తూరు ప్రసాద్ చారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమేజింగ్ స్టార్ అశోక్ వేముల హీరోగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అశోక్ వేముల మాట్లాడుతూ శ్రీలత నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ప్రతిభావంతమైన నటి మాత్రమే కాకుండా సమాజ సేవ పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సినీ రంగంలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

హీరోయిన్ శ్రీలత నేత మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘రీ-బర్త్’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే సందేశంతో రూపొందుతోందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీఓపీ దేవా, సహ దర్శకుడు రతన్ కుమార్, మేకప్ ఆర్టిస్టు అంజిబాబు, లక్ష్మణ్, నాగేష్, అప్రోజ్, ఫిరోజ్, సీనియర్ నటులు కనకా రెడ్డి, శిరీష, మేకల శ్రీకాంత్, చెర్రీ బాబు తదితరులు పాల్గొని శ్రీలత నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading

Entertainment

ఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…

Published

on

మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ పిలుపు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక ఐబీ కాలనీ లో వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రావుల స్వరాజ్ పాల్గొని మాట్లాడుతూ.. పెద్దమ్మతల్లి ఆలయం & నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 15 బుధవారం నుండి నెల రోజులపాటు నిర్వహించు ఆషాడ మాస శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో ముదిరాజ్ కులస్తులు, బంధువులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి, అమ్మవారి కృపను పొందగలరని ఆలయ కమిటీ కోరుతుంది. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యార్థం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, ఇస్తారి, శీలం శ్రీనివాస్, చిగురు సాయి, చొప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Entertainment

తమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం

Published

on

బిబిఎంఏ న్యూస్ / చెన్నై మే 10

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య విజయ్ సీఎం పదవిని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుకు కొంత సమయం అవసరమని ప్రజలను కోరుతూ, ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తన పాలన పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేసిన విజయ్, మహిళల భద్రత, డ్రగ్స్ రహిత సమాజం, అవినీతి నిర్మూలన, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ “విద్యార్థులకు విజయ్ మామ ఎప్పుడూ అండగా ఉంటాడు” అని అన్నారు. తమిళనాడులో ప్రజల ప్రభుత్వం ఏర్పడి కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని విజయ్ వ్యాఖ్యానించారు.

Continue Reading

Trending