Politics
విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆయన వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు. యువత, కాంగ్రెస్ పార్టీ నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందనడం వాస్తవం కాదని అన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిత్తశుద్ధితో వ్యవహరించాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాగే విద్యాశాఖ మంత్రిని కూడా తప్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
News
చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
News
ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమ ఫలితమేనని NSUI నేతల వ్యాఖ్యలు
గోదావరిఖని: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఖని చౌరస్తాలో NSUI ఆధ్వర్యంలో విద్యార్థి విజయోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ నాయకత్వంలో, NSUI పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ, NEET UG-2026 పరీక్షా పత్రం లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల హక్కుల కోసం సాగిన పోరాటానికి తొలి విజయమని అన్నారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించేందుకు 21 ఏళ్లు నిండిన యువతకు చట్టసభల్లో ప్రవేశ అర్హత కల్పించే ప్రతిపాదనను స్వాగతించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటాన్ని కొనియాడుతూ, యువత భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఉద్యమం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, NEET పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరపడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, NTA పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో NSUI నాయకులు గంగారపు ప్రవీణ్, సంధీ అక్షయ్, కేశవ, జీవన్, ఆకాష్, కార్తీక్, చరణ్, దినేష్, సుమంత్, అభిషేక్, సనిత్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, రికీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వ లింగస్వామి, ఓదెలు, ధీటీ బాలరాజు, కొప్పుల శంకర్, ముస్తఫా, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, ఫజల్, దూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra3 days agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
