Andhra
బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
‘గబ్బర్ సింగ్’ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించినట్లు సమాచారం. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి వైద్య చికిత్స వివరాలను తెలుసుకున్నారని తెలుస్తోంది.
‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని అంత్యాక్షరి గ్యాంగ్లో నటించిన రమేష్ తన ప్రత్యేక హావభావాలు, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుని “గబ్బర్ సింగ్ రమేష్”గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులతో పాటు సీనియర్ జర్నలిస్టు ఖాజాపాష (కేపీ) కూడా రమేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
Andhra
విధులకు వెళ్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు
బీబీఎంఏ న్యూస్ – పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి సంచలనంగా మారింది. సోమవారం అర్థరాత్రి చిత్తూరులోని ఎంపీడీఎల్ డిస్టిలరీలో విధులకు బైక్పై వెళ్తుండగా పుంగనూరు టోల్గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
దేవేంద్ర 2023లో మదనపల్లె రామిరెడ్డిగారిపల్లె శివారులో కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ తరిగొండ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్లపై ఇటీవల మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది రోడ్డు ప్రమాదంగా నమోదు కాగా, భూ వివాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Andhra
గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే మామిడి పంట.. ఆవేదనలో ఏపీ రైతులు
అమరావతి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏడాది పొడవునా శ్రమించి, భారీ పెట్టుబడులు పెట్టి పండించిన మామిడి పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరలు మరింత పతనమవడంతో కొందరు రైతులు తమ పంటను రోడ్డు పక్కనే పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంగినపల్లి, తోతాపురి వంటి మామిడి రకాలకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా భర్తీ చేయలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎరువులు, పురుగుమందులు, కార్మిక వ్యయాలు, రవాణా ఖర్చులు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Andhra
తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన
తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.
చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.
ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News6 days agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime1 week ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News2 weeks agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
