News
పీఎంజే చోరీతో కరీంనగర్లో రాజకీయ రగడa
పీఎంజే జ్యువెలర్స్ ఘటనతో కరీంనగర్లో రాజకీయ తుపాన్
గంగుల క్యాంపు కార్యాలయంపై దాడి.. పాడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం
బీజేపీ–బీఆర్ఎస్ మధ్య ఆరోపణల యుద్ధం.. భారీగా మోహరించిన పోలీసులు
బిబిఎంఏ న్యూస్ ప్రత్యేక కథనం / కరీంనగర్:
కరీంనగర్లో పీఎంజే జ్యువెలర్స్ చోరీ ఘటన రాజకీయ రంగు పులుముకుని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండగా గురువారం పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది.
బీజేపీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కొందరు కార్యాలయంపై దాడికి దిగినట్లు సమాచారం. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చెందిన వాహనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వాహనం అద్దాలు పగులగొట్టడంతో పాటు ఇతర భాగాలను కూడా ధ్వంసం చేశారు. కార్యాలయం వద్ద ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్యాంపు కార్యాలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యంలో రాజకీయ దాడులు తగవని విమర్శించారు. మరోవైపు బీజేపీ నాయకులు తమ నిరసనను అణచివేసే ప్రయత్నాల వల్లే ఉద్రిక్తత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
పీఎంజే జ్యువెలర్స్ చోరీ ఘటనతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ చిచ్చుగా మారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News
కొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
కొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
బిబిఎంఏ న్యూస్:
లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టారు. గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి తమ సమస్యలను తెలియజేశారు. వడ్ల తూకంలో రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ప్రతి 40 కిలోల సంచికి అదనంగా నాలుగు కిలోల వడ్లు తీసుకుంటూ తమను నష్టపరుస్తున్నారని వారు మండిపడ్డారు.
ఇదే కాకుండా, ఇప్పటికే విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. వర్షాల కారణంగా వడ్లు తడిసి నష్టపోతున్న పరిస్థితుల్లో అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, లారీ డ్రైవర్లు కూడా ప్రతి సంచికి రెండు కిలోలు అదనంగా వడ్లు ఇస్తేనే లోడింగ్కు వస్తామని షరతులు విధిస్తున్నారని రైతులు తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తక్షణమే స్పందించి తూకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
News
దండేపల్లిలో భారీ వర్షం బీభత్సం – బైక్పై కూలిన చెట్టు
దండేపల్లిలో భారీ వర్షం బీభత్సం – బైక్పై చెట్టు కూలి నష్టం
బిబిఎంఏ న్యూస్:దండేపల్లి
దండేపల్లి, మే 6: మంగళవారం సాయంత్రం దండేపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. ఈ వర్షానికి తోడు గాలులు తీవ్రంగా వీచడంతో ఒక పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ చెట్టు ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన హోండా షైన్ బైక్పై కూలడంతో బైక్కు భారీ నష్టం వాటిల్లింది.
ఈ ఘటనలో బైక్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా, ఫ్యూయల్ ట్యాంక్ మరియు సీటు కూడా నాశనమయ్యాయి. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో బైక్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించి మార్గాన్ని క్లియర్ చేశారు. భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News
రోడ్లపై చెట్లు… పరిస్థితులను సమీక్షించిన సీపీ
గాలి వానతో రోడ్లపై చెట్లు… వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు
బిబిఎంఏ న్యూస్/రామగుండం: అకాల గాలి వర్షం ప్రభావంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్లపై కూలిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలగగా, పోలీసులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎం. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్ కలిసి మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో రోడ్లపై పడిన చెట్లను తొలగించారు.
అనంతరం సీపీ దండేపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో గోడలు కూలి నలుగురు మృతి చెందిన ఘటనలను పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
-
News2 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News2 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News3 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
News2 days agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
india2 weeks agoనేడే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ,
-
News2 days agoరోడ్లపై చెట్లు… పరిస్థితులను సమీక్షించిన సీపీ
-
News2 weeks agoసూరయ్యపల్లిలో డ్రైనేజ్ పనుల ప్రారంభం రూ.10 లక్షలతో అభివృద్ధి
-
Telangana2 days agoలక్షెట్టిపేట గోడకూలి నలుగురు రైతులు మృతి
