Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

పీఎంజే చోరీతో కరీంనగర్‌లో రాజకీయ రగడa

Published

on

పీఎంజే జ్యువెలర్స్ ఘటనతో కరీంనగర్‌లో రాజకీయ తుపాన్

గంగుల క్యాంపు కార్యాలయంపై దాడి.. పాడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం

బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య ఆరోపణల యుద్ధం.. భారీగా మోహరించిన పోలీసులు

బిబిఎంఏ న్యూస్ ప్రత్యేక కథనం / కరీంనగర్:

కరీంనగర్‌లో పీఎంజే జ్యువెలర్స్ చోరీ ఘటన రాజకీయ రంగు పులుముకుని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండగా గురువారం పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కొందరు కార్యాలయంపై దాడికి దిగినట్లు సమాచారం. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘటనలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చెందిన వాహనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వాహనం అద్దాలు పగులగొట్టడంతో పాటు ఇతర భాగాలను కూడా ధ్వంసం చేశారు. కార్యాలయం వద్ద ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్యాంపు కార్యాలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యంలో రాజకీయ దాడులు తగవని విమర్శించారు. మరోవైపు బీజేపీ నాయకులు తమ నిరసనను అణచివేసే ప్రయత్నాల వల్లే ఉద్రిక్తత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.

పీఎంజే జ్యువెలర్స్ చోరీ ఘటనతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ చిచ్చుగా మారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

నూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం

Published

on

పెద్దపల్లి, జిల్లా బిబిఎంఎ న్యూస్ జూన్ 14:

నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత నూతన పోలీస్ స్టేషన్ల స్వంత భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూ విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

End

Continue Reading

Andhra

గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే మామిడి పంట.. ఆవేదనలో ఏపీ రైతులు

Published

on

అమరావతి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏడాది పొడవునా శ్రమించి, భారీ పెట్టుబడులు పెట్టి పండించిన మామిడి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరలు మరింత పతనమవడంతో కొందరు రైతులు తమ పంటను రోడ్డు పక్కనే పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంగినపల్లి, తోతాపురి వంటి మామిడి రకాలకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా భర్తీ చేయలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంటున్నారు.

 

వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎరువులు, పురుగుమందులు, కార్మిక వ్యయాలు, రవాణా ఖర్చులు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.

 

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

 

Continue Reading

News

ఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Published

on

జనగామ, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ డెంటల్ వైద్యురాలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నయీంనగర్‌కు చెందిన మహ్మద్ రహముద్దీన్ కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోవర్ధనగిరి దర్గా సమీపానికి రాగానే కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది.

 

ఈ ప్రమాదంలో రహముద్దీన్ కుమార్తె, డెంటిస్ట్ హబీబా హఫ్సా (27), బంధువైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహ్మద్ అసదుద్దీన్ (26) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

 

Continue Reading

Trending