Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలి: నల్లా రాధాకృష్ణ

Published

on

మేడ్చల్, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): హైదరాబాద్‌లోని నాచారంలో గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల హక్కులు, ఎస్సీ రిజర్వేషన్లపై సమావేశం నిర్వహించారు. బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులు మతం మారినంత మాత్రాన కుల వివక్ష అంతం కాదని, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ల హక్కు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరం అధ్యక్షులు బుచ్చిగారి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దళిత క్రైస్తవుల సమస్యలు, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల అమలుపై విస్తృతంగా చర్చించారు. గద్దర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

Published

on

 

హైదరాబాద్, ఆగస్టు 6 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఆచార్య జయశంకర్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, త్యాగం చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Continue Reading

News

చుండూరు దళిత అమరవీరులకు గోదావరిఖనిలో ఘన నివాళులు

Published

on

గోదావరిఖని, ఆగస్టు 6 (బీబీఎంఏ న్యూస్):

చుండూరు దళిత మారణకాండ జరిగి 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్‌లో చుండూరు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాలంకుస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతినిధి ఈదునూరి పద్మ, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్ తదితరులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కుల వివక్ష కారణంగా చుండూరులో ఎనిమిది మంది దళితులను అత్యంత దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, చుండూరు అమరవీరులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొచ్చు శంకర్, జనగామ రాజనర్సు, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్, కాంపల్లి జీవన్ కుమార్, రామగిరి రమేష్, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Andhra

మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలి: ఎమ్మార్పీఎస్

Published

on

హామీ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని హెచ్చరిక

కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: 2024 ఎన్నికల సమయంలో మాదిగలకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. బుధవారం కాకినాడ కచేరిపేట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ, ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని మాదిగలకు కేటాయించాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచనల మేరకు టీడీపీ విజయానికి కృషి చేశామని, ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించడం బాధాకరమన్నారు. నాలుగు రోజుల్లో సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సమావేశానికి కాకినాడ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి పసుపులేటి చిన్నబాబు మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

Trending