Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

డీజీపీగా సీవీ ఆనంద్.. శివధర్ రెడ్డి సేవలకు ప్రశంసలు

Published

on

డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్.. శివధర్ రెడ్డి సేవలకు ప్రశంసలు

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీవీ ఆనంద్ మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం పదవీ విరమణ పొందుతున్న సీనియర్ పోలీస్ అధికారి శివధర్ రెడ్డి సేవలను ఆయన కొనియాడారు.

32 సంవత్సరాలపాటు పోలీస్ శాఖలో శివధర్ రెడ్డి అందించిన సేవలు అమూల్యమని ఆనంద్ పేర్కొన్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, మావోయిస్టుల లొంగుబాటులో కీలకపాత్ర పోషించారని తెలిపారు. భారీ స్థాయిలో ఆయుధాల స్వాధీనం వంటి విజయాలు రాష్ట్ర భద్రతకు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారని కొనియాడారు.

ఇక రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రధాన సవాళ్లుగా మారాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

2016 నుంచి తనతో కలిసి పనిచేసిన అధికారుల అనుభవంతో టీమ్ వర్క్‌గా ముందుకు సాగుతామని, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడటంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

నూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం

Published

on

పెద్దపల్లి, జిల్లా బిబిఎంఎ న్యూస్ జూన్ 14:

నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత నూతన పోలీస్ స్టేషన్ల స్వంత భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూ విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

End

Continue Reading

Andhra

గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే మామిడి పంట.. ఆవేదనలో ఏపీ రైతులు

Published

on

అమరావతి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏడాది పొడవునా శ్రమించి, భారీ పెట్టుబడులు పెట్టి పండించిన మామిడి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరలు మరింత పతనమవడంతో కొందరు రైతులు తమ పంటను రోడ్డు పక్కనే పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంగినపల్లి, తోతాపురి వంటి మామిడి రకాలకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా భర్తీ చేయలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంటున్నారు.

 

వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎరువులు, పురుగుమందులు, కార్మిక వ్యయాలు, రవాణా ఖర్చులు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.

 

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

 

Continue Reading

News

ఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Published

on

జనగామ, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ డెంటల్ వైద్యురాలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నయీంనగర్‌కు చెందిన మహ్మద్ రహముద్దీన్ కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోవర్ధనగిరి దర్గా సమీపానికి రాగానే కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది.

 

ఈ ప్రమాదంలో రహముద్దీన్ కుమార్తె, డెంటిస్ట్ హబీబా హఫ్సా (27), బంధువైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహ్మద్ అసదుద్దీన్ (26) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

 

Continue Reading

Trending