News
సింగరేణిలో త్వరలో మెడికల్ బోర్డు పునఃప్రారంభం
పారదర్శకంగా నిర్వహించాలి.. కార్మికుల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్/కోల్బెల్ట్, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో వివిధ కారణాలతో కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలోనే పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని సూచించారు.
ఇటీవల కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి తెలిపారు. కార్మికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
మెడికల్ బోర్డు ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, వారి వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.
సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
News
ఆరోగ్యమే పోలీసుల అసలైన బలం: సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): పోలీసు విధుల్లో శారీరక దారుఢ్యం అత్యంత కీలకమని, ఆరోగ్యంగా ఉంటేనే ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వర్తించగలమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో అర్ముడ్ సిబ్బందికి నిర్వహించిన వారాంత పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం పరేడ్ను పరిశీలించిన సీపీ, విధులతో పాటు ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. సుమారు 100 మంది సిబ్బంది పాల్గొని పరేడ్ను క్రమశిక్షణతో నిర్వహించారని ప్రశంసించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం కమిషనరేట్ పరిధిలో తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, త్వరలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మహిళా పోలీసుల చురుకైన భాగస్వామ్యాన్ని అభినందించిన సీపీ, భవిష్యత్తులో మహిళా పోలీసుల కోసం ప్రత్యేక ప్లాటూన్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు అర్ముడ్ సిబ్బంది పాల్గొన్నారు.
News
70 కోట్లతో గూడెం ఆలయ అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన
మాటిచ్చిన 36 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ అమలు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని కేవలం 36 రోజుల్లోనే అమలు చేయడం గర్వకారణమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేపు గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.70 కోట్లతో ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేరోజు సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల ఉద్యోగ నియామక పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేయనున్నారని చెప్పారు. అనంతరం శ్రీరాంపూర్ ఓసీని సందర్శించి, మంచిర్యాల విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు.
News
వినియోగదారులకు వేగవంతమైన విద్యుత్ సేవలు.. TGSPDCL కీలక నిర్ణయం
కొత్త కనెక్షన్లు, లోడ్ పెంపు, పేరు మార్పు వంటి సేవల్లో స్థానిక స్థాయిలోనే వేగవంతమైన అనుమతులు
బిబిఎంఏ న్యూస్ / హైదరాబాద్
వినియోగదారులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన విద్యుత్ సేవలు అందించేందుకు TGSPDCL కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యుత్ కనెక్షన్లు, లోడ్ పెంపు, పేరు మార్పు వంటి సేవలకు సంబంధించిన అనుమతి పరిమితులను పెంచుతూ, నిర్ణయాలను స్థానిక స్థాయిలోనే త్వరగా తీసుకునే అవకాశం కల్పించింది.
ఈ మార్పుతో వినియోగదారులకు సేవల కోసం ఎదురుచూపులు తగ్గి, తక్కువ సమయంలోనే అవసరమైన అనుమతులు లభించనున్నాయి. పరిపాలనా ప్రక్రియను సరళతరం చేయడం ద్వారా పారదర్శకత, సమర్థత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా TGSPDCL ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. వినియోగదారుల సౌలభ్యాన్ని పెంచుతూ సేవల డెలివరీని మరింత బలోపేతం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
-
News2 days agoఉపసర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News1 week agoఫోన్ కాల్తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB1 week agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News1 week agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
