Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

70 కోట్లతో గూడెం ఆలయ అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన

Published

on

మాటిచ్చిన 36 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ అమలు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని కేవలం 36 రోజుల్లోనే అమలు చేయడం గర్వకారణమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

రేపు గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.70 కోట్లతో ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

అదేరోజు సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల ఉద్యోగ నియామక పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేయనున్నారని చెప్పారు. అనంతరం శ్రీరాంపూర్ ఓసీని సందర్శించి, మంచిర్యాల విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

వినియోగదారులకు వేగవంతమైన విద్యుత్ సేవలు.. TGSPDCL కీలక నిర్ణయం

Published

on

కొత్త కనెక్షన్లు, లోడ్ పెంపు, పేరు మార్పు వంటి సేవల్లో స్థానిక స్థాయిలోనే వేగవంతమైన అనుమతులు

బిబిఎంఏ న్యూస్ / హైదరాబాద్

వినియోగదారులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన విద్యుత్ సేవలు అందించేందుకు TGSPDCL కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యుత్ కనెక్షన్లు, లోడ్ పెంపు, పేరు మార్పు వంటి సేవలకు సంబంధించిన అనుమతి పరిమితులను పెంచుతూ, నిర్ణయాలను స్థానిక స్థాయిలోనే త్వరగా తీసుకునే అవకాశం కల్పించింది.

 

ఈ మార్పుతో వినియోగదారులకు సేవల కోసం ఎదురుచూపులు తగ్గి, తక్కువ సమయంలోనే అవసరమైన అనుమతులు లభించనున్నాయి. పరిపాలనా ప్రక్రియను సరళతరం చేయడం ద్వారా పారదర్శకత, సమర్థత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

 

ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా TGSPDCL ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. వినియోగదారుల సౌలభ్యాన్ని పెంచుతూ సేవల డెలివరీని మరింత బలోపేతం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Continue Reading

Andhra

తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన

Published

on

తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

 

చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

 

ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Continue Reading

News

మహిళా సంఘాల ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: మంత్రి సీతక్క

Published

on

BBMA NEWS:

ములుగు జిల్లా మహిళా సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మా శక్తి’ బ్రాండ్ లోగోను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్తకళలు, పెయింటింగ్స్, బొమ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ‘మా శక్తి’ బ్రాండ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ ద్వారా ఉత్పత్తుల విలువ పెరిగి మార్కెట్లో విశ్వసనీయత, ఆదరణ పెరుగుతాయని పేర్కొన్నారు.

 

మహిళల ఉత్పత్తులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ మార్కెటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయ అవకాశాలు కల్పించి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

జిల్లాలో మహిళలు తయారు చేసే అన్ని ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, ఒకే గుర్తింపు కల్పించడం ద్వారా ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు బాటలు పడతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగుగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Continue Reading

Trending