News
సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యపై కేంద్ర మంత్రికి వినతి
8 ఇంక్లైన్ కాలనీ, బీబీఎంఏ న్యూస్, జూన్ 11:
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మారుపేర్ల (అలియాస్నే మ్స్ ) సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రి దేవేందర్ పటేల్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థ రికార్డుల్లో నమోదైన మారుపేర్లకు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమస్య వల్ల కార్మికులకు అందాల్సిన పలు సంక్షేమ ప్రయోజనాలు ఆలస్యమవుతున్నాయని, వెంటనే జోక్యం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో సమన్వయం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని పేర్కొన్నట్లు వెల్లడించారు.
సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బద్రి దేవేందర్ పటేల్ స్పష్టం చేశారు.
News
మహిళా సంఘాల ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: మంత్రి సీతక్క
BBMA NEWS:
ములుగు జిల్లా మహిళా సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మా శక్తి’ బ్రాండ్ లోగోను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్తకళలు, పెయింటింగ్స్, బొమ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ‘మా శక్తి’ బ్రాండ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ ద్వారా ఉత్పత్తుల విలువ పెరిగి మార్కెట్లో విశ్వసనీయత, ఆదరణ పెరుగుతాయని పేర్కొన్నారు.
మహిళల ఉత్పత్తులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ మార్కెటింగ్కు ప్రాధాన్యత ఇస్తూ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయ అవకాశాలు కల్పించి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లాలో మహిళలు తయారు చేసే అన్ని ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, ఒకే గుర్తింపు కల్పించడం ద్వారా ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు బాటలు పడతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగుగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
Andhra
23 నెలల చిన్నారికి నోబుల్ వరల్డ్ రికార్డు.. కాకినాడకు గర్వకారణమైన ఆమైరా ఖాదరి నవాజ్
అసాధారణ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి.. కలెక్టర్ హరి చందన్ ప్రత్యేక అభినందనలు
కాకినాడ, BBMA NEWS, జూన్ 11:
కాకినాడకు చెందిన 23 నెలల చిన్నారి షేక్ ఆమైరా ఖాదరి నవాజ్ తన అసాధారణ ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది. రామకృష్ణారావుపేటకు చెందిన ఎండీ బాషా మనవరాలు, షేక్ ఖజా మొహిద్దిన్ – మహమ్మద్ బషీర్ దంపతుల కుమార్తె అయిన ఆమైరా చిన్న వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి ఈ ఘనత సాధించింది.
పండ్లు, కూరగాయలు, ఇంగ్లీష్ అక్షరాలు, ఫోనిక్ పదాలు, సంఖ్యలు, శరీర భాగాలు, ఆకారాలు, పక్షులు, వ్యతిరేక పదాలు, గృహోపకరణాలు గుర్తించి చెప్పడమే కాకుండా వివిధ రైమ్స్ను సైతం చక్కగా చెప్పగలగడం ఆమె ప్రత్యేకత. చిన్నారి ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ హరి చందన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తన చాంబర్కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లను పరిశీలించిన కలెక్టర్, ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని కొనియాడారు.
ఆమైరాను “వన్ ఇన్ ఎ మిలియన్”గా గుర్తిస్తూ పురస్కార పత్రాలను అందజేయడం విశేషమని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అలీమ్ తెలిపారు. చిన్నారి తండ్రి షేక్ ఖజా మొహిద్దిన్ చెన్నైలో వైర్లెస్ సిస్టమ్ ఇంజనీర్గా పనిచేస్తుండగా, తల్లి మహమ్మద్ బషీర్ ఎం.ఫార్మసీ పూర్తి చేసి గృహిణిగా ఉన్నారు. ఆమైరా సాధించిన ఘనతపై కాకినాడ వాసులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ చిన్నారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
crime
వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
BBMA NEWS:
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
-
News1 day agoఉపసర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News1 week agoఫోన్ కాల్తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB1 week agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News1 week agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
