Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Published

on

బీబీఎంఏ న్యూస్, హైదరాబాద్, జూన్ 11:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం జలసౌధలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణమవుతున్న న్యాయపరమైన సమస్యలు, పర్యావరణ అనుమతుల అంశాలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

 

ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతంగా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, పెండింగ్‌లో ఉన్న అనుమతులు, సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు సాగునీటి ప్రయోజనాలు త్వరగా అందేలా ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వకిటి శ్రీహరి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మహిళా సంఘాల ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: మంత్రి సీతక్క

Published

on

BBMA NEWS:

ములుగు జిల్లా మహిళా సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మా శక్తి’ బ్రాండ్ లోగోను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్తకళలు, పెయింటింగ్స్, బొమ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ‘మా శక్తి’ బ్రాండ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ ద్వారా ఉత్పత్తుల విలువ పెరిగి మార్కెట్లో విశ్వసనీయత, ఆదరణ పెరుగుతాయని పేర్కొన్నారు.

 

మహిళల ఉత్పత్తులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ మార్కెటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయ అవకాశాలు కల్పించి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

జిల్లాలో మహిళలు తయారు చేసే అన్ని ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, ఒకే గుర్తింపు కల్పించడం ద్వారా ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు బాటలు పడతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగుగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Continue Reading

Andhra

23 నెలల చిన్నారికి నోబుల్ వరల్డ్ రికార్డు.. కాకినాడకు గర్వకారణమైన ఆమైరా ఖాదరి నవాజ్

Published

on

అసాధారణ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి.. కలెక్టర్ హరి చందన్ ప్రత్యేక అభినందనలు

కాకినాడ, BBMA NEWS, జూన్ 11:

కాకినాడకు చెందిన 23 నెలల చిన్నారి షేక్ ఆమైరా ఖాదరి నవాజ్ తన అసాధారణ ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది. రామకృష్ణారావుపేటకు చెందిన ఎండీ బాషా మనవరాలు, షేక్ ఖజా మొహిద్దిన్ – మహమ్మద్ బషీర్ దంపతుల కుమార్తె అయిన ఆమైరా చిన్న వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి ఈ ఘనత సాధించింది.

 

పండ్లు, కూరగాయలు, ఇంగ్లీష్ అక్షరాలు, ఫోనిక్ పదాలు, సంఖ్యలు, శరీర భాగాలు, ఆకారాలు, పక్షులు, వ్యతిరేక పదాలు, గృహోపకరణాలు గుర్తించి చెప్పడమే కాకుండా వివిధ రైమ్స్‌ను సైతం చక్కగా చెప్పగలగడం ఆమె ప్రత్యేకత. చిన్నారి ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ హరి చందన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తన చాంబర్‌కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లను పరిశీలించిన కలెక్టర్, ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని కొనియాడారు.

 

ఆమైరాను “వన్ ఇన్ ఎ మిలియన్”గా గుర్తిస్తూ పురస్కార పత్రాలను అందజేయడం విశేషమని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అలీమ్ తెలిపారు. చిన్నారి తండ్రి షేక్ ఖజా మొహిద్దిన్ చెన్నైలో వైర్లెస్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, తల్లి మహమ్మద్ బషీర్ ఎం.ఫార్మసీ పూర్తి చేసి గృహిణిగా ఉన్నారు. ఆమైరా సాధించిన ఘనతపై కాకినాడ వాసులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ చిన్నారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

Continue Reading

crime

వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Published

on

 BBMA NEWS:

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

Trending