Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

లక్షెట్టిపేట గోడకూలి నలుగురు రైతులు మృతి

Published

on

 

పంట కాపాడే ప్రయత్నంలో విషాదం… లక్షెట్టిపేట మండలంలో గుండె విదారక ఘటన

బిబిఎంఏ న్యూస్:

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో అకాల వర్షం రైతు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో గోడ కూలి నలుగురు రైతులు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, కోత పూర్తయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడంతో రైతులు తమ పంటను కల్లాల్లోనే నిల్వ ఉంచుకున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడంతో ధాన్యం తడవకుండా కాపాడేందుకు సుమారు 15 మంది రైతులు కల్లాల వద్దకు చేరుకుని కవర్లు కప్పారు. అనంతరం సమీపంలోని పాత గోడ వద్ద నిలుచున్న సమయంలో ఈదురుగాలులు తీవ్రంగా వీచాయి. గాలుల ఒత్తిడిని తట్టుకోలేక గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న రైతులు శిథిలాల కింద చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించారు. అయితే అప్పటికే నలుగురు రైతులు మృతి చెందినట్లు గుర్తించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంటను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని, పంట కొనుగోళ్లలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వద్ద గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం

Published

on

 

కొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం

బిబిఎంఏ న్యూస్:

లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టారు. గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి తమ సమస్యలను తెలియజేశారు. వడ్ల తూకంలో రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ప్రతి 40 కిలోల సంచికి అదనంగా నాలుగు కిలోల వడ్లు తీసుకుంటూ తమను నష్టపరుస్తున్నారని వారు మండిపడ్డారు.

ఇదే కాకుండా, ఇప్పటికే విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. వర్షాల కారణంగా వడ్లు తడిసి నష్టపోతున్న పరిస్థితుల్లో అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, లారీ డ్రైవర్లు కూడా ప్రతి సంచికి రెండు కిలోలు అదనంగా వడ్లు ఇస్తేనే లోడింగ్‌కు వస్తామని షరతులు విధిస్తున్నారని రైతులు తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తక్షణమే స్పందించి తూకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

Continue Reading

News

దండేపల్లిలో భారీ వర్షం బీభత్సం – బైక్‌పై కూలిన చెట్టు

Published

on

దండేపల్లిలో భారీ వర్షం బీభత్సం – బైక్‌పై చెట్టు కూలి నష్టం

బిబిఎంఏ న్యూస్:దండేపల్లి

దండేపల్లి, మే 6: మంగళవారం సాయంత్రం దండేపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. ఈ వర్షానికి తోడు గాలులు తీవ్రంగా వీచడంతో ఒక పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ చెట్టు ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన హోండా షైన్ బైక్‌పై కూలడంతో బైక్‌కు భారీ నష్టం వాటిల్లింది.

ఈ ఘటనలో బైక్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా, ఫ్యూయల్ ట్యాంక్ మరియు సీటు కూడా నాశనమయ్యాయి. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో బైక్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించి మార్గాన్ని క్లియర్ చేశారు. భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Continue Reading

News

గోదావరిఖనిలో రెండవ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనిజ కోహిర్కర్ బాధ్యతలు

Published

on

బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని,

మే 2: గోదావరిఖనిలో రెండవ అదనపు జిల్లా జడ్జిగా శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి గుజ్జేటి సత్యనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెల్లడించారు.

శ్రీనిజ కోహిర్కర్ బాధ్యతల స్వీకరణతో స్థానిక న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ సేవల్లో ఆమె అనుభవం ప్రజలకు న్యాయం అందించడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Continue Reading

Trending