Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

కాళేశ్వరం లో నేడు సీఎం రేవంత్ రెడ్డి సభ

Published

on

భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

భూపాలపల్లి, సోమవారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు రైతులకు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాలేశ్వరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి, అక్కడ ప్రసిద్ధ కాలేశ్వరం ముక్తేశ్వర దేవస్థాన అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. సుమారు రూ.200 కోట్ల నిధులతో దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

అనంతరం ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకుని, ప్రాజెక్టు మరమ్మత్తులపై పూణే సాంకేతిక నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

తదుపరి కార్యక్రమంగా ముఖ్యమంత్రి కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. రెండు నుంచి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ఈ నిధులు అందనున్నాయి. సభలో ముఖ్యమంత్రి రైతుల సమస్యలపై మాట్లాడటంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరించనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ ప్రాంత ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సీఎం పర్యటన … భద్రతపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సంకీర్త్

Published

on

సీఎం పర్యటనకు ముందస్తు సమీక్ష… భద్రతపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సంకీర్త
కాలేశ్వరం/బీబీఎంఏ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాలేశ్వరంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లపై ఆదివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి భూపాలపల్లి జిల్లాకు రానున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐఏఎస్,జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
సభ జరుగనున్న ప్రాంగణాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ స్థలం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, వేదిక నిర్మాణం వంటి అంశాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ సదుపాయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే హెలిప్యాడ్ వద్ద భద్రతా ప్రమాణాలను కూడా పరిశీలించారు.
అదనంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

Continue Reading

News

స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి

Published

on

గోదావరిఖని: గోదావరిఖని ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ గాజవేని వెన్నెల (26) మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్ నుండి లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూలుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గౌతమి నగర్ మూలమలుపు వద్ద వెనుక నుండి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వెన్నెల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

News

కేపీహెచ్‌బీలో బస్సు ఫైర్ ప్రయాణికులు సురక్షితం

Published

on

కేపీహెచ్‌బీ / బీబీఎంఏ న్యూస్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

కేపీహెచ్‌బీ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలకొల్లుకు వెళ్లాల్సిన ఈ బస్సు (నంబర్: NL02B9955)గా గుర్తించారు. బస్సు వెనుక భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు.

డ్రైవర్, సిబ్బంది చాకచక్యంగా స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రావెల్స్ యాజమాన్యానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Continue Reading

Trending