Police News
POLICE NEWS BBMA// చాదర్ఘాట్ పోలీసులు నకిలీ కరెన్సీ రాకెట్ను ఛేదించారు; నిందితుడు అరెస్ట్, ₹94,000 విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
POLICE NEWS BBMA// చాదర్ఘాట్ పోలీసులు నకిలీ కరెన్సీ రాకెట్ను ఛేదించారు; నిందితుడు అరెస్ట్, ₹94,000 విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
చాదర్ఘాట్ పోలీసులు నకిలీ కరెన్సీ కేసును విజయవంతంగా వెలికితీసి క్రైం నంబర్ 127/2026గా నమోదు చేసి BNS చట్టంలోని సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 07-04-2026న మలక్పేట్లోని కొటక్ మహీంద్ర బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ రేపాల ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ క్యాష్ రీసైక్లర్ మెషీన్లో 10 నకిలీ ₹500 నోట్లు గుర్తించారు.
దర్యాప్తులో ఈ నోట్లు అహ్మద్ పాషా (33), చంద్రాయణగుట్ట నివాసి ఖాతాలో 27-03-2026న జమ చేసినట్టు తేలింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నకిలీ కరెన్సీ సేకరించినట్టు ఒప్పుకున్నాడు. షాద్నగర్ వద్ద ₹94,000 విలువైన నకిలీ నోట్లు తెచ్చుకుని వాటిని చలామణి చేయాలని యత్నించాడు. ఇందులో ₹5,000 బ్యాంక్లో జమ కాగా, మిగిలిన ₹89,000 విలువైన 178 నోట్లు అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లో ఉన్న ప్రధాన సరఫరాదారుని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉం.
Police News
POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “సేవా పథకం”లకు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బంది ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపికైన అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.
విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు సహజంగానే లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు చట్టపరిధిలో ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్నత విలువలతో విధులు నిర్వర్తించే వారికి ప్రభుత్వ గుర్తింపు, ప్రజల ప్రశంసలు దక్కుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక సేవా పథకాలకు ఎంపిక కావడం ప్రతి పోలీస్ అధికారికి గౌరవప్రదమైన విషయమని, ఈ అవార్డులు శాఖలోని ఇతర సిబ్బందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
సేవా పథకాలకు ఎంపికైన వారిలో ఇన్స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఏఆర్ఎస్ఐ టి. సూర్య ప్రకాష్తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు మొహమ్మద్ అబ్దుల్ కలీమ్, పీ. రాజయ్య, ఆర్. నర్సింగరావు, సీహెచ్. శేఖర్, ఆర్. శేఖర్, ఎ. శ్రీనివాస్ మరియు కానిస్టేబుళ్లు ఎం. కిరణ్ కుమార్, కె. జలపతి ఉన్నారు. ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
News
తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం: సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం, జూన్ 2 ( బిబిఎంఏ న్యూస్):
రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎందరో అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను సీపీ ప్రదానం చేశారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్, వివిధ విభాగాల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News
జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ నితికా పంత్
బీబీఎంఏ న్యూస్ / ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సేవా పథకాలు, ప్రశంసా పత్రాలను ఎస్పీ నితికా పంత్ అందజేశారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ఎస్పీ, ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-
crime3 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana2 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment3 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime3 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime3 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News4 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
