Police News
యువతను మత్తు బారిన పడనివ్వం: సీపీ అంబర్ కిశోర్ ఝా
రామగుండం కమిషనరేట్లో డ్రగ్ కంట్రోల్ ప్రత్యేక బృందాలు
బిబిఎంఏ న్యూస్ /రామగుండం జూన్ 6:
గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, సరఫరా, నిల్వ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో సర్కిల్ స్థాయిలో డ్రగ్ కంట్రోల్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
ఇప్పటికే కమిషనరేట్లో రెండు యాంటీ నార్కోటిక్ బృందాలు పనిచేస్తుండగా, వాటికి అదనంగా కొత్త ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల అక్రమ రవాణా మూలాలను గుర్తించడం, సరఫరా మార్గాలపై నిఘా పెంచడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ బృందాలు సమాచార దాతల వ్యవస్థ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రత్యేక దాడులు నిర్వహించనున్నాయి.
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597కు సమాచారం అందించాలని కమిషనర్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజ అభివృద్ధికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన కమిషనర్, వాటి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News
అర్ధరాత్రి లాడ్జీల్లో డీసీపీ భాస్కర్ ఆకస్మిక తనిఖీలు
బిబిఎంఏ న్యూస్ మంచిర్యాల, జూన్ 7:
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్లో శనివారం అర్ధరాత్రి విస్తృత స్థాయిలో నాకాబందీ, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ స్వయంగా పర్యవేక్షించారు.
పట్టణంలోని ఐబీ చౌరస్తా, లక్ష్మీ థియేటర్ ప్రాంతాల్లో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బందితో కలిసి నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు.
అనంతరం పట్టణంలోని పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డీసీపీ భాస్కర్, లాడ్జీల రికార్డులను పరిశీలించి బస చేస్తున్న వారి వివరాలను ధృవీకరించారు. ప్రతి అతిథి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, గుర్తింపు పత్రాలను పరిశీలించాలని లాడ్జీల యాజమాన్యాలకు సూచించారు.
లాడ్జీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ACB
జగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
బిబిఎంఏ న్యూస్ /జగిత్యాల, జూన్ 4:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) మొయినుద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
సమాచారం ప్రకారం, ఓ వ్యక్తి అధికారిక పనికి సంబంధించి ఎఫ్ఆర్ఓ మొయినుద్దీన్ను సంప్రదించగా, పని చేసేందుకు రూ.80 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో గురువారం కొడిమ్యాల అటవీశాఖ కార్యాలయంలో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్ను పట్టుకున్నారు.
ఈ దాడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోని సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
News
ఫోన్ కాల్తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ ఉద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆయన భార్య గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, ఉద్యోగరీత్యా పరకాల పట్టణంలో నివాసం ఉంటున్నారు.
నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మహ్మద్ షరీఫ్ ఉద్దీన్కు ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వెల్లంపల్లి రోడ్డులో ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
crime4 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana2 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment4 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime4 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
Entertainment4 weeks agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
