Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

జగిత్యాల సభలో కేసీఆర్ ఫైర్, కాంగ్రెస్ పై తీవ్రవాక్యలు

Published

on

జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

బిబిఎంఏ న్యూస్ / జగిత్యాల

ఏప్రిల్ 20: జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సభలో ఘాటుగా స్పందించిన కేసీఆర్, “పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను” అంటూ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలను ఖండిస్తూ, “ఈ ఎదవలు చావాలంటే కేసీఆర్ చస్తాడా?” అంటూ ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ తనను రాజకీయంగా గానీ, వ్యక్తిగతంగా గానీ దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించామని, దీని వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు. రైతులు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా స్వీకరించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించామని కేసీఆర్ పేర్కొన్నారు. “ఐదేళ్లలో పూర్తి చేయకపోతే ఎన్నికల్లో నిలబడమని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం” అని అన్నారు. ప్రస్తుతం తాగునీటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పోరాటానికి సిద్ధంగా ఉండాలి

ప్రజలు తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. “మంచి మాటతో వినకపోతే కఠినంగా పోరాడాలి” అని సూచించారు. వ్యక్తిగత విమర్శలపై స్పందిస్తూ ప్రజల మద్దతు ఉన్నంతకాలం తనకు ఎలాంటి భయం లేదన్నారు.

వయస్సు వ్యాఖ్యలపై స్పందన

కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించిన కేసీఆర్, వయస్సు ఆధారంగా నాయకత్వాన్ని అంచనా వేయడం సరికాదన్నారు. “నాకు 72 ఏళ్లు, ఆయనకు 75 ఏళ్లు. వయస్సు కాదు, పని చేయాలనే తపన ముఖ్యం” అని తెలిపారు.

తెలంగాణ భవిష్యత్తుపై వ్యాఖ్యలు

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు గర్వంగా జీవించే వరకు పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. “ఇది మా తెలంగాణ అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పే రోజు వచ్చే వరకు పని చేస్తాం. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేయడమే నా లక్ష్యం” అని పేర్కొన్నారు.

జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలతో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభకు భారీగా ప్రజలు హాజరై కేసీఆర్ ప్రసంగానికి మద్దతు తెలిపారు. పార్టీ కార్యకర్తలు నినాదాలతో సభను ఉత్సాహభరితంగా మార్చారు.

మొత్తంగా, జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు పెంచినట్లు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

Published

on

 

బిబిఎంఏ న్యూస్ /

భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 20: రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం చేరుకున్నారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ శుభానంద (పార్వతి) అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలతో సీఎంను సన్మానించి, చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు తీర్థప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు. సీఎం రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

తరువాత సీఎం మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకుని అనిల్ జైన్తో కలిసి బ్యారేజ్‌ను పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పరిస్థితులపై చర్చించారు.

సీఎం వెంట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కాటారం మండలం నస్తూరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

Continue Reading

News

సీఎం పర్యటన … భద్రతపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సంకీర్త్

Published

on

సీఎం పర్యటనకు ముందస్తు సమీక్ష… భద్రతపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సంకీర్త
కాలేశ్వరం/బీబీఎంఏ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాలేశ్వరంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లపై ఆదివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి భూపాలపల్లి జిల్లాకు రానున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐఏఎస్,జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
సభ జరుగనున్న ప్రాంగణాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ స్థలం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, వేదిక నిర్మాణం వంటి అంశాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ సదుపాయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే హెలిప్యాడ్ వద్ద భద్రతా ప్రమాణాలను కూడా పరిశీలించారు.
అదనంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

Continue Reading

News

స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి

Published

on

గోదావరిఖని: గోదావరిఖని ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ గాజవేని వెన్నెల (26) మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్ నుండి లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూలుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గౌతమి నగర్ మూలమలుపు వద్ద వెనుక నుండి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వెన్నెల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

Trending