Police News
🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
BBMA POLICE e:NEWS //🏆 మూడేళ్ల విజయగాథ – న్యాయ పోరాటానికి ప్రతీక
BBMA & BBMA POLICE e:NEWS ప్రారంభమై విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో సంస్థ న్యాయపరమైన పోరాటానికి అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు నమ్మకమైన వేదికగా ఎదిగింది. మీడియా బాధ్యతను గౌరవిస్తూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.
⚖️ 90 కేసుల పరిష్కారం – న్యాయానికి నిలువెత్తు నిదర్శనం
ఈ మూడు సంవత్సరాలలో BBMA & BBMA POLICE e:NEWS మొత్తం 90 కేసులను విజయవంతంగా పరిష్కరించింది. అన్యాయం జరిగిన బాధితుల పక్షాన నిలబడి, వారికి న్యాయం అందేలా కృషి చేసింది. ఇది మా సంస్థ నిబద్ధతకు, నిజాయితీకి ప్రతీక.
🛡️ నైతిక విలువలు – బ్లాక్మెయిల్కు స్థానం లేదు
మా సంస్థ ఎప్పుడూ నైతిక విలువలను పాటిస్తుంది.
ఎవరినైనా బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే చీప్ మెంటాలిటీ మా సంస్థలో లేదు. BBMA & BBMA POLICE e:NEWS ఎప్పుడూ పారదర్శకతతో, న్యాయబద్ధంగా పనిచేస్తుంది.
🔥 ఎవరైనా సరే – తప్పు చేస్తే ప్రశ్నిస్తాం
మా రిపోర్టర్లు లేదా సభ్యులకు ఎలాంటి హాని చేయాలనుకున్నా, వారు రాజకీయ నాయకులు అయినా, ప్రభుత్వ అధికారులు అయినా, మేము వెనుకడుగు వేయము. అవసరమైతే ప్రజల ముందు నిలబెట్టి ప్రశ్నించే ధైర్యం మా సంస్థకు ఉంది.
🤝 ప్రెస్ & మీడియా సహకారం
BBMA వెబ్ ఛానెల్కే కాకుండా, అన్ని పత్రికా సోదరులకు మా పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. మీడియా కుటుంబం బలంగా ఉండాలని మేము విశ్వసిస్తున్నాము.
⚠️ కఠిన హెచ్చరిక – రిపోర్టర్ల భద్రత మా బాధ్యత
ఎలాంటి తప్పూ చేయని మా రిపోర్టర్ల జోలికి ఎవరైనా వస్తే, న్యాయం జరిగే వరకు మేము విశ్రాంతి తీసుకోము. ఇది B. రమేష్ అనే వ్యక్తి విషయంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఇవ్వబడుతున్న హెచ్చరిక.
ఇది మొదటి తప్పుగా పరిగణించి, ఇక్కడితో ఆగాలని గౌరవపూర్వకంగా సూచిస్తున్నాము.
మరలా ఇలాంటి చర్యలు పునరావృతమైతే, రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటాము.
🚨 BBMA శక్తి ఏమిటో చూపిస్తాం
ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే, BBMA అంటే ఏమిటో స్పష్టంగా చూపిస్తాము. న్యాయం కోసం మా పోరాటం ఎప్పటికీ ఆగదు.
👤 డైరెక్టర్
K. శ్రీనివాస్ మూర్తి
🌐 వెబ్ ప్లాట్ఫార్మ్స్
www.bbmanews.com�
www.policenewsbbma.com�
www.policebbmanews.com�
📱 డిజిటల్ ప్లాట్ఫార్మ్స్
Play Store App: BBMA News
E-Paper: epaper.bbmanews.com
🌍 పనిచేస్తున్న రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | కర్ణాటక | ఢిల్లీ | ఒడిశా | ఉత్తరప్రదేశ్ | బీహార్
ACB
జగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
బిబిఎంఏ న్యూస్ /జగిత్యాల, జూన్ 4:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) మొయినుద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
సమాచారం ప్రకారం, ఓ వ్యక్తి అధికారిక పనికి సంబంధించి ఎఫ్ఆర్ఓ మొయినుద్దీన్ను సంప్రదించగా, పని చేసేందుకు రూ.80 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో గురువారం కొడిమ్యాల అటవీశాఖ కార్యాలయంలో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్ను పట్టుకున్నారు.
ఈ దాడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోని సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
News
ఫోన్ కాల్తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ ఉద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆయన భార్య గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, ఉద్యోగరీత్యా పరకాల పట్టణంలో నివాసం ఉంటున్నారు.
నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మహ్మద్ షరీఫ్ ఉద్దీన్కు ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వెల్లంపల్లి రోడ్డులో ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Police News
POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “సేవా పథకం”లకు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బంది ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపికైన అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.
విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు సహజంగానే లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు చట్టపరిధిలో ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్నత విలువలతో విధులు నిర్వర్తించే వారికి ప్రభుత్వ గుర్తింపు, ప్రజల ప్రశంసలు దక్కుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక సేవా పథకాలకు ఎంపిక కావడం ప్రతి పోలీస్ అధికారికి గౌరవప్రదమైన విషయమని, ఈ అవార్డులు శాఖలోని ఇతర సిబ్బందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
సేవా పథకాలకు ఎంపికైన వారిలో ఇన్స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఏఆర్ఎస్ఐ టి. సూర్య ప్రకాష్తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు మొహమ్మద్ అబ్దుల్ కలీమ్, పీ. రాజయ్య, ఆర్. నర్సింగరావు, సీహెచ్. శేఖర్, ఆర్. శేఖర్, ఎ. శ్రీనివాస్ మరియు కానిస్టేబుళ్లు ఎం. కిరణ్ కుమార్, కె. జలపతి ఉన్నారు. ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
-
crime3 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana2 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment4 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime3 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime3 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News4 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
