Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

BBMA POLICE e:NEWS // తిరుపతిలో ఘనంగా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకారం

Published

on

BBMA POLICE e:NEWS // తిరుపతిలో ఘనంగా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకారం

BBMA POLICE e:NEWS // ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి – మాజీ మంత్రి టీజీ వెంకటేష్

తిరుపతి, మార్చి 8: రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధి, ఐక్యత, సంఘ సభ్యుల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తామని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిండుకుర్తి నరసింహులు అధ్యక్షులుగా, నూతలపాటి హేమంత్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా, పబ్బతి మధుసూధన కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా తమ బాధ్యతలను స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజానికి ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడంతో పాటు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి సమాజానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ పెద్దల సూచనలు, మార్గదర్శకత్వంతో సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ యువతలో భక్తి భావాలను పెంపొందించే కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదగేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వంటి మహనీయులు ఆర్యవైశ్య వర్గానికి చెందినవారు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వారి త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వాసవి పురాణంలో పేర్కొన్న ధర్మాలను భవిష్యత్ తరాలకు అందిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంఘ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

🔴 BBMA NEWS ప్రభుత్వ సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Published

on

By

🔴 BBMA NEWS సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

BBMA NEWS POLICE E:NEWS//

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని వివిధ ప్రక్రియలు, నిబంధనలను మరింత సరళీకరించేలా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, వేగంగా అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అవసరమైతే కొన్ని చట్టాలను కూడా సరళతరం చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్‌తో పాటు పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచుతూ ప్రజాకేంద్రిత పాలన దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు.

#AndhraPradesh

 

– V. Vamsi, Social Media Incharge, BBMA & BBMA POLICE E:NEWS

 

Continue Reading

News

🔴 BBMA POLICE E:NEWS //మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు

Published

on

By

🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦

(more…)

Continue Reading

News

BBMA మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు

Published

on

By

BBMA NEWS మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు

🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦

 

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.

 

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై దిశానిర్దేశం చేశాను. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.

 

మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించాను. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాను. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పాను.

 

#GHMC

#MunicipalAdministration

#UrbanDevelopment

#PrajaPrabhutvam

Continue Reading

Trending