Connect with us

Andhra

🔴 BBMA NEWS ప్రభుత్వ సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Published

on

🔴 BBMA NEWS సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

BBMA NEWS POLICE E:NEWS//

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని వివిధ ప్రక్రియలు, నిబంధనలను మరింత సరళీకరించేలా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, వేగంగా అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అవసరమైతే కొన్ని చట్టాలను కూడా సరళతరం చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్‌తో పాటు పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచుతూ ప్రజాకేంద్రిత పాలన దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు.

#AndhraPradesh

 

– V. Vamsi, Social Media Incharge, BBMA & BBMA POLICE E:NEWS

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

ఫిబ్రవరి 14 పెమికుల రోజు కాదు దేశానికి “బ్లాక్ డే”

Published

on

ఫిబ్రవరి 14  దేశానికి “బ్లాక్ డే

ఫిబ్రవరి 14, 2019 – ఒక జాతీయ విషాద దినం

2019 ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో దేశం తన 40 మంది వీర జవాన్లను కోల్పోయింది. ప్రేమికుల దినంగా ప్రపంచం జరుపుకునే ఈ తేదీ, భారతదేశానికి మాత్రం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన జవాన్లతో వెళ్లుతున్న కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. జమ్మూ నుంచి శ్రీనగర్కు బయలుదేరిన కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని, పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని బస్సును ఢీకొట్టారు. మధ్యాహ్నం సుమారు 3.15 గంటల సమయంలో జరిగిన ఈ ఘోర దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు.

ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రసంస్థ జైష్‑ఎ‑ముహమ్మద్ బాధ్యత స్వీకరించింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం, శోక వాతావరణం నెలకొంది.

🕯️ నివాళులు & జ్ఞాపకాలు

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పిస్తారు. వారి త్యాగం దేశ భద్రతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు అమరవీరులకు నివాళులు తెలుపుతూ సందేశాలు విడుదల చేస్తుంటారు.

 ఈ రోజు ఎందుకు కీలకం?

దేశ భద్రతపై జరిగిన అత్యంత భయంకరమైన దాడుల్లో పుల్వామా ఉగ్రదాడి ఒకటి. ఈ ఘటన దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సైనికుల త్యాగం, ధైర్యం, దేశసేవ భావన తరతరాలకు ప్రేరణగా నిలుస్తోంది.

📍 ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా జరుపుకుంటున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం పుల్వామా దాడిలో అమరులైన 40 మంది జవాన్ల జ్ఞాపకార్థం ఈ రోజును **“బ్లాక్ డే”**గా గుర్తుచేసుకుంటూ దేశం నివాళులు అర్పిస్తోంది.

Continue Reading

Andhra

గుంతల రహిత రహదారులు నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

Published

on

గుంతల రహిత రహదారులు నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశ

 

బిబిఎంఏ న్యూస్ / అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో రహదారులను పూర్తిగా గుంతల రహితం చేసేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆర్‌అండ్‌బీ శాఖ పనులను సమీక్షించి, డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా రహదారి మరమ్మత్తులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

 

ఈ ఏడాదిలోనే ₹400 కోట్ల నాబార్డ్ నిధులతో 1,250 కి.మీ. పనులకు (191 పనులు) టెండర్లు పూర్తయ్యాయి. అదనంగా ₹600 కోట్లతో 227 పనులు, ₹1,000 కోట్లతో 2,104 కి.మీ. రహదారుల కోసం టెండర్లు ఆహ్వానించారు. పనులు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి.

 

ఇంకా ₹277 కోట్లతో 607 కి.మీ., ₹233 కోట్లతో కొత్త పనులకు అనుమతులు పరిశీలనలో ఉన్నాయి. చక్రవాతాలతో తీవ్రంగా దెబ్బతిన్న 4,794 కి.మీ. సహా మొత్తం 9,101 కి.మీ. రహదారుల పునరుద్ధరణకు మరో ₹500 కోట్లు ప్రతిపాదించామని అధికారులు తెలిపారు.

 

గత ప్రభుత్వంలో ఏర్పడిన ₹4,000 కోట్ల బకాయిలలో ₹1,900 కోట్లు క్లియర్ చేయడంతో కాంట్రాక్టర్లలో విశ్వాసం పెరిగిందని సీఎం చెప్పారు. నెలవారీ బిల్లు క్లియరెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టి పారదర్శకతను పెంచామని వివరించారు.

 

గతేడాది 5,471 కి.మీ. రహదారి పనులకు ₹2,500 కోట్లు, ‘మిషన్ పొత్హోల్‌-ఫ్రీ’ కింద ₹861 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు నివేదించారు. రహదారి పనుల నాణ్యతపై రాజీ లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సీఎం ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సహా ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Continue Reading

Andhra

విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు

Published

on

By

విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు

విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విచ్చేసిన కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

 

దేశ ఆర్థిక, పారిశ్రామిక విధానాలపై కీలక చర్చలు జరిగే చోట ఈ సమావేశం జరగడం విశేషం..

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఆయనకున్న దృష్టి, పెట్టుబడులు ఆకర్షించే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో మంత్రి శ్రీ @naralokesh గారి కృషితో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం..

 

భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడే ఈ CII సమ్మిట్ వేళ ఈ భేటీ జరగడం ఆనందదాయకం!

@PiyushGoyal

Continue Reading

Trending