Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Politics

హరీష్ రావు సిట్ విచారణకు ముందుకు: రాజకీయ డైవర్షన్‌పై తీవ్ర ఆరోపణలు

Published

on

హరీష్ రావు సిట్ విచారణకు ముందుకు: రాజకీయ డైవర్షన్‌పై తీవ్ర ఆరోపణలు

✴️ సిట్ విచారణకు బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీష్ రావు 👇

 

🔸రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసు ఇచ్చారు.

 

🔸నేను సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసు ఇచ్చి వెళ్లారు

 

🔸చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి నేడు సిట్ విచారణకు వెళ్తున్నాను

 

🔸రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు నేను భయపడను

 

🔸నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు

 

🔸దండుపాళ్యం ముటా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయటపెట్టా

 

🔸రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయటపడితే నష్టం జరుగుతందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి

 

🔸సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కున్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కున్నాం

 

🔸తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ తయారు చేసిన సైనికులం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడం

 

🔸ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి, మహిళలకు మహాలక్ష్మి ఏమైంది, అవ్వాతాతలకు రూ. 4 వేల పింఛన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగాం

 

🔸హిల్టీపీ, పవర్ స్కాం, భూ కుంభకోణాలు బయటపెట్టినం

 

🔸నీ వాటాల విషయం ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నవు

 

🔸కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా కట్టబెడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోక నీ బండారం బయటపెట్టినం

 

🔸అసెంబ్లీ లోపల వెలుపల నిన్ను నిలదీసినం

 

🔸పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారి మీద నోటీసులు.. మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చినవు

 

🔸మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తరట

 

🔸పట్టణాల్లో వడ్డీ లేని రుణాలు ఇస్తరట

 

🔸మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నడు

 

🔸బీఆర్ఎస్ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నడు.

 

🔸సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయి.. 40 శాతం గెలిచి విజయం సాధించింది

 

🔸మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అంటున్నడు

 

🔸రెండేళ్ల నుంచి ఇదే డ్రామా ఆడుతున్నడు

 

🔸గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే సుప్రీం కోర్టు చెంప చెల్లుమనే తీర్పు ఇచ్చింది

 

🔸న్యాయం మా వైపు ఉంది కాబట్టి హైకోర్టులో కూడా గెలిచాం

 

🔸రెండేళ్లు గడిచింది.. ఇదే సీరియల్ ఎన్ని రోజులు నడుపుతావు

 

🔸నువ్వు ఎన్ని డైవర్షన్లు చేసినా నీ బొగ్గు స్కాం, పవర్ స్కాం, హిల్టీపీ స్కాం బయటపెడుతం

 

🔸ఆంధ్రాకు అమ్ముడుపోయిన దానిపై నిలదీస్తూనే ఉంటం

 

🔸బొగ్గు స్కాంపై నేను కిషన్ రెడ్డి గారిక లేఖ రాస్తున్నా

 

🔸కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యింది నిజం కాకుంటే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తున్నాం

 

🔸రేవంత్ రెడ్డి, తన బామ్మర్దితో కలిసి చేస్తున్న స్కాం ఎలా జరిగిందో విచారణ జరపాలి

 

🔸నైనీ బ్లాక్ ఒక్కటే కాదు, అన్ని టెండర్లు రద్దు చేయాలి

 

🔸సీబీఐ విచారణ జరపాలి.. వెంటనే బీజేపీ స్పందించాలి

 

🔸దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేస్తున్నాం

 

🔸సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్‌బాల్ ఆడుతున్నాడు

 

🔸 సోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడడు

 

🔸న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, నేను తప్పు చేయలేదు, కేవలం బురదజల్లే ప్రయత్నంలో భాగం ఇది

 

🔸రాజకీయ డ్రామా ఇది, మేము భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తం ఎక్కడికైనా వెళ్తం

 

🔸రేవంత్ రెడ్డి ఈ కేసులో నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసినా సుప్రీం కోర్టు, హైకోర్టు కొట్టి వేసింది

 

🔸తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తాం. నీ అవినీతి కుంభకోణాలు బయటపెడుతాం

 

🔸మూడు రోజులు ముందే ప్లాన్ వేసి, దావోస్ నుంచి వచ్చే దాకా ఈ సీరియల్ నడవాలని అటెన్షన్ డైవర్షన్

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి

Published

on

మందమర్రి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఆర్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత ఎం.డి. మునీర్ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా విశేష సేవలు అందిస్తోందని అన్నారు. జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్న ఎం.డి. మునీర్ అభినందనీయులని కొనియాడారు.

 

రచయితగా కూడా తన ప్రతిభను చాటుకుంటూ పుస్తక రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను అందించడం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. పుస్తకాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, యువతలో చదివే అలవాటును పెంపొందించేందుకు ఇలాంటి రచనలు దోహదపడతాయని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

Continue Reading

News

గూడెం అభివృద్ధికి కొత్త ఊపు.. ఆలయ పునరుద్ధరణ, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన

Published

on

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

మంచిర్యాల, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):

ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు.

 

శనివారం దండేపల్లి మండలం గూడెంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు , మంత్రి అడ్లూరి  కుమార్ , మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, గూడెం దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

 

అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా రూ.74.40 కోట్ల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులు ప్రారంభించడం వల్ల జిల్లాలో వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Continue Reading

News

సింగరేణిలో త్వరలో మెడికల్ బోర్డు పునఃప్రారంభం

Published

on

పారదర్శకంగా నిర్వహించాలి.. కార్మికుల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

హైదరాబాద్/కోల్‌బెల్ట్, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో వివిధ కారణాలతో కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలోనే పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని సూచించారు.

 

ఇటీవల కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి తెలిపారు. కార్మికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

 

మెడికల్ బోర్డు ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, వారి వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.

 

సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Continue Reading

Trending