Politics
హరీష్ రావు సిట్ విచారణకు ముందుకు: రాజకీయ డైవర్షన్పై తీవ్ర ఆరోపణలు
✴️ సిట్ విచారణకు బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీష్ రావు 👇
🔸రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసు ఇచ్చారు.
🔸నేను సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసు ఇచ్చి వెళ్లారు
🔸చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి నేడు సిట్ విచారణకు వెళ్తున్నాను
🔸రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు నేను భయపడను
🔸నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు
🔸దండుపాళ్యం ముటా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయటపెట్టా
🔸రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయటపడితే నష్టం జరుగుతందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి
🔸సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కున్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కున్నాం
🔸తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ తయారు చేసిన సైనికులం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడం
🔸ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి, మహిళలకు మహాలక్ష్మి ఏమైంది, అవ్వాతాతలకు రూ. 4 వేల పింఛన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగాం
🔸హిల్టీపీ, పవర్ స్కాం, భూ కుంభకోణాలు బయటపెట్టినం
🔸నీ వాటాల విషయం ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నవు
🔸కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా కట్టబెడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోక నీ బండారం బయటపెట్టినం
🔸అసెంబ్లీ లోపల వెలుపల నిన్ను నిలదీసినం
🔸పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారి మీద నోటీసులు.. మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చినవు
🔸మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తరట
🔸పట్టణాల్లో వడ్డీ లేని రుణాలు ఇస్తరట
🔸మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నడు
🔸బీఆర్ఎస్ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నడు.
🔸సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయి.. 40 శాతం గెలిచి విజయం సాధించింది
🔸మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అంటున్నడు
🔸రెండేళ్ల నుంచి ఇదే డ్రామా ఆడుతున్నడు
🔸గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే సుప్రీం కోర్టు చెంప చెల్లుమనే తీర్పు ఇచ్చింది
🔸న్యాయం మా వైపు ఉంది కాబట్టి హైకోర్టులో కూడా గెలిచాం
🔸రెండేళ్లు గడిచింది.. ఇదే సీరియల్ ఎన్ని రోజులు నడుపుతావు
🔸నువ్వు ఎన్ని డైవర్షన్లు చేసినా నీ బొగ్గు స్కాం, పవర్ స్కాం, హిల్టీపీ స్కాం బయటపెడుతం
🔸ఆంధ్రాకు అమ్ముడుపోయిన దానిపై నిలదీస్తూనే ఉంటం
🔸బొగ్గు స్కాంపై నేను కిషన్ రెడ్డి గారిక లేఖ రాస్తున్నా
🔸కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యింది నిజం కాకుంటే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తున్నాం
🔸రేవంత్ రెడ్డి, తన బామ్మర్దితో కలిసి చేస్తున్న స్కాం ఎలా జరిగిందో విచారణ జరపాలి
🔸నైనీ బ్లాక్ ఒక్కటే కాదు, అన్ని టెండర్లు రద్దు చేయాలి
🔸సీబీఐ విచారణ జరపాలి.. వెంటనే బీజేపీ స్పందించాలి
🔸దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేస్తున్నాం
🔸సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్బాల్ ఆడుతున్నాడు
🔸 సోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడడు
🔸న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, నేను తప్పు చేయలేదు, కేవలం బురదజల్లే ప్రయత్నంలో భాగం ఇది
🔸రాజకీయ డ్రామా ఇది, మేము భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తం ఎక్కడికైనా వెళ్తం
🔸రేవంత్ రెడ్డి ఈ కేసులో నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసినా సుప్రీం కోర్టు, హైకోర్టు కొట్టి వేసింది
🔸తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తాం. నీ అవినీతి కుంభకోణాలు బయటపెడుతాం
🔸మూడు రోజులు ముందే ప్లాన్ వేసి, దావోస్ నుంచి వచ్చే దాకా ఈ సీరియల్ నడవాలని అటెన్షన్ డైవర్షన్
Politics
BBMA POLICE E:NEWS// పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
BBMA POLICE E:NEWS// పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
కంబదూరు మండలం రాళ్లనంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత లేకపోవడం, మెనూ పాటించకపోవడంపై నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులతో మాట్లాడి భోజనం ఆలస్యంగా అందుతున్నదని తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే సమయానికి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం ఎగ్ ఫ్రై ఇవ్వాల్సి ఉండగా ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వడం, భోజన నాణ్యత తక్కువగా ఉండడంపై సంబంధిత అధికారులను మందలించారు.
అధికారులు ప్రతి పాఠశాలను నిరంతరం తనిఖీ చేయాలని, లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే పాఠశాలలో ఫ్లోరింగ్, టాయిలెట్లు, వంటగది పనులను స్వంత నిధులతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు 80 యోగా మ్యాట్లు కూడా అందజేశారు.
Politics
BBMA POLICE E:NEWS// తెలంగాణలో కొత్త శకం ప్రారంభం – ప్రజా ఉద్యమానికి నాంది!
BBMA POLICE E:NEWS// కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం
సమయం వచ్చింది. 2026 ఏప్రిల్ 25న తెలంగాణలో ఒక కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుడుతోంది. ఇది కేవలం ఒక పార్టీ కాదు, ప్రజల ఆలోచనలు, ఆశలు, ఆకాంక్షలతో రూపుదిద్దుకుంటున్న ఒక గొప్ప ప్రజా ఉద్యమం.
ప్రజల కోసం, ప్రజలతో కలిసి ముందుకు సాగే ఈ మార్పు పారదర్శకత, నిబద్ధత, అభివృద్ధి అనే విలువలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నాళ్లుగానో ప్రజలు నిజమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు—వారి సమస్యలను వినే, అర్థం చేసుకునే, పరిష్కారాల దిశగా నడిచే నాయకత్వం. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.
యువత నుంచి రైతుల వరకు, ప్రతి వర్గానికీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది. మీ ఆలోచనలు, మీ మద్దతు ఈ మార్పుకు బలంగా నిలుస్తాయి. రాబోయే తరాలకు మెరుగైన తెలంగాణను అందించేందుకు మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
చరిత్ర సృష్టించే ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి.
Politics
BBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
BBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పలువురు టీడీపీ నాయకుల అనైతిక వ్యవహారాలు బయటపడుతూ రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్గా ఉన్న సతీష్ యాదవ్పై రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర ఆలయ బాధ్యతలు నిర్వహించాల్సిన వ్యక్తి ఇలాంటి అసభ్యకర ప్రవర్తనలో పాల్గొనడం స్థానిక భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
అదే విధంగా బొల్లవోలు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి మద్యం మత్తులో దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు తూర్పు కనుపూరు గ్రామానికి చెందిన ఒబ్బాయి శివ కుమార్, ముత్యాలమ్మ తల్లి ఆలయ బోర్డు సభ్యుడిగా ఉండి, ఓ మహిళతో గెస్ట్ హౌస్లో అసభ్య కార్యక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
పవిత్ర స్థానాల్లో ఉన్న బాధ్యతాయుత పదవులను చేపట్టిన వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం సమాజానికి తప్పు సందేశాన్ని ఇస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
-
Telangana2 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Telangana2 weeks agoమంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి
-
Telangana2 weeks agoఘనంగా రిమ్ జిమ్ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం
-
Telangana2 weeks agoఉప్పల్లో హత్య కేసు ఛేదన… 6 గంటల్లో ఇద్దరు నిందితులు అరెస్ట్
-
Telangana2 weeks agoత్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి ప్రకటన
-
india6 days agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
-
News7 days agoకాంగ్రెస్కు గుడ్బై చెప్పిన టి. జీవన్ రెడ్డి
-
Politics4 days agoBBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
