Politics
ఇటుక రాజు మాదిగ ఘన నివాళులు – డా. మర్రి చెన్నారెడ్డి జయంతి
మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రివర్యులు డా. మర్రి చెన్నారెడ్డి గారి జయంతి సందర్భంగా, ఇటుక రాజు మాదిగ గారు, టీఆర్ఎంపీఎస్ఎస్ (TRMPSS) అధినేతగా మరియు సంస్థ సభ్యుల తరఫున ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ప్రజాసేవను జీవిత లక్ష్యంగా భావించి, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తన సేవలను అంకితం చేసిన మహనీయుడు డా. మర్రి చెన్నారెడ్డి గారు.
డా. మర్రి చెన్నారెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల కష్టసుఖాలను తనవిగా భావించారు. ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి అపారమైనది. సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు అనే సూత్రాలను ఆయన ఆచరణలో చూపించారు. ఆయన నాయకత్వంలో చేపట్టిన నిర్ణయాలు లక్షలాది మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చాయి.
ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు అమలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, విద్యా విస్తరణ, ఆరోగ్య సదుపాయాల మెరుగుదల వంటి రంగాల్లో ఆయన చూపిన శ్రద్ధ నేటికీ ఆదర్శంగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం, కార్మికుల హక్కులు, పేదల అభ్యున్నతి కోసం ఆయన తీసుకున్న చర్యలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
కేంద్ర మంత్రిగా, గవర్నర్గా దేశవ్యాప్తంగా తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించిన నాయకుడు డా. మర్రి చెన్నారెడ్డి గారు. ఏ పదవిలో ఉన్నా ఆయన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేశారు. అధికారాన్ని సాధనంగా కాకుండా, సేవగా భావించిన అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు.
టీఆర్ఎంపీఎస్ఎస్ (TRMPSS) అధినేత ఇటుక రాజు మాదిగ గారు మరియు సంస్థ సభ్యులు, డా. మర్రి చెన్నారెడ్డి గారి ఆశయాల నుంచి స్ఫూర్తి పొందుతూ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారు. అణగారిన వర్గాలకు సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవితం కల్పించాలనే ఆయన ఆలోచనా ధోరణి మా సంస్థ లక్ష్యాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.
డా. మర్రి చెన్నారెడ్డి గారి జీవితం ఒక స్ఫూర్తి గ్రంథం లాంటిది. నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన ప్రతీక. నేటి తరాలు ఆయన సేవలను స్మరించుకొని, సమాజంలో మార్పు తీసుకొచ్చే బాధ్యతను స్వీకరించాలి. ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది.
ఈ జయంతి సందర్భంగా, ఆ మహానాయకుడిని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. ఇటుక రాజు మాదిగ గారు, టీఆర్ఎంపీఎస్ఎస్ అధినేతగా మరియు సంస్థ సభ్యుల తరఫున, డా. మర్రి చెన్నారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయనకు మరోసారి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము.
News
మేదరుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక దృష్టి
వెదురుతో చేతివృత్తులు, డెకరేషన్ రంగంలో పనిచేసేవారిని ఆదుకుంటాం: డీఎన్టీ బోర్డు కమిటీ సభ్యుడు భరత్ బాయ్
హైదరాబాద్, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 11:
వెదురుతో పనిముట్లు తయారు చేసే మేదరులు, డెకరేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందని కేంద్ర డీఎన్టీ డెవలప్మెంట్ బోర్డు కమిటీ సభ్యులు భరత్ బాయ్ తెలిపారు. నాగోల్లోని ఈషా ఫంక్షన్ హాల్లో తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భరత్ బాయ్ మాట్లాడుతూ వెదురుతో పనిముట్లు తయారు చేసే, డెకరేషన్ పనులు చేసే మేదరులను డీఎన్టీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సీడ్ పథకం ద్వారా అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, మేదరులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి డెకరేషన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నందికంటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ మాట్లాడుతూ మేదరుల కులవృత్తికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అందరూ సంఘటితమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ బీసీల అభివృద్ధికి కుల సంఘాల నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు రావినూతల శశిధర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కులవృత్తులు చేసే వారు మూలస్తంభాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో డెకరేషన్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎస్బీఐ ఏజీఎం రామకృష్ణుడు డెకరేషన్ కార్మికులకు ప్రమాద బీమా, ఎస్బీఐ బీమా పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డెకరేషన్ కార్మికులకు లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ నిర్వహించి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీఎంఎండీవీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఇందూరు గంగాధర్, డెకరేషన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతకోటి భిక్షపతి, కోశాధికారి పారాసాని ఈశ్వర్, ఉపాధ్యక్షులు, డీఎన్టీ నాయకులు, సంఘం ప్రతినిధులు, డెకరేషన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
News
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. శంకర్ గౌడ్ డిమాండ్
ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి
గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారులంతా పార్టీలు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర, జిల్లా మహిళా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా అనుముల కళావతి, కార్యదర్శిగా తోడేటి స్వరూప, ఉపాధ్యక్షులుగా కోడిపుంజుల జ్యోతి, గంగారపు శాంతలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల సరోజన, కార్యదర్శిగా పున్నం మంజులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
News
మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.
దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News5 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
