News
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు :జిల్లా ఎస్పి అశోక్ కుమార్
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు :జిల్లా ఎస్పి అశోక్ కుమార్
గంజాయి తో పట్టుబడ్డ ముగ్గురికి 7 సం” జైలు
₹10,000 జరిమాన…
బిబిఎంఏ న్యూస్ / జగిత్యాల
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కరికీ ₹10,000 జరిమానా విధించారు.
నిందితుల వివరాలు:
A1: కిన్నరి @ మేకల రాజు, వయసు 29, చిలుకవాడ నివాసం
A2: ఆర్ముల్ల సాయి కుమార్, వయసు 22, జగిత్యాల టౌన్
A3: మడవి చందు, వయసు 22, ఆసిఫాబాద్
కేసు వివరాల ప్రకారం, 28-09-2024 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పట్టణ పోలీసులకు న్యూ బస్టాండ్ సమీపంలోని బాంబే షాపింగ్ మాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు. అతను పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశీలనలో అతని వద్ద 250 గ్రాముల గంజాయి గుర్తించబడింది. విచారణలో అతను తన స్నేహితులు ఆర్ముల్ల సాయి కుమార్, మడవి చందు తో కలిసి అధిక లాభాల కోసం గంజాయి కొనుగోలు చేసి అమ్మకానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు.
కేసులో సేకరించిన ఆధారాలు, నిందితుల ఒప్పుకోవడం, సాక్ష్యాల ఆధారంగా, న్యాయమూర్తి నారాయణ 7 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ.. నిందితుల చర్యలు చట్టవిరుద్ధమే కాక, సమాజానికి హానికరమైనవని, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటారని, ఇలాంటి నేరాలకు పాల్పడినవారెవ్వరూ శిక్ష తప్పించుకోలేరని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చట్టం పాటించి సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని సూచించారు.
ఈ కేసులో నిందితుల శిక్ష సాధించడంలో కృషి చేసిన జగిత్యాల టౌన్ సిఐ కిషోర్, పి.పి. కే. మల్లేశం గౌడ్, సి.ఎం.ఎస్. ఎస్సై ఎస్. శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్లు శ్రీనివాస్, మహేంద్ర, కానిస్టేబుల్లు రాజు నాయక్, కిరణ్ కుమార్లను ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు.
News
రూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
కోరుట్లలో కార్ కన్సల్టెన్సీకి మోసం… రూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేస నమోదు
బిబిఎంఏ న్యూస్ / కోరుట్ల : ఏప్రిల్ 2:
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ యాజమాన్యాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెల్గటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన మోటపలుకుల వెంకట్ అనే వ్యక్తి రిపోర్టర్గా చలామణి అవుతూ జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ వద్ద రెండు కార్లు తీసుకున్నట్లు సమాచారం.
మొదటగా తీసుకున్న హ్యుందాయ్ క్రెటా కారుకు సంబంధించి రూ.2.5 లక్షలు, అనంతరం తీసుకున్న గ్రాండ్ ఐ-10 కారుకు రూ.2.15 లక్షలు చెల్లించాల్సి ఉండగా మొత్తం రూ.4.65 లక్షలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు కన్సల్టెన్సీ యాజమాన్యం తెలిపింది.
డబ్బులు అడగడానికి వెళ్లిన జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ యజమానులు చెక్కపల్లి నవీన్, కుర్ర ఆంజనేయులను తాను రిపోర్టర్నని, డబ్బులు అడిగితే మీ సంగతి చూస్తానని మోటపలుకుల వెంకట్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ మేరకు చెక్కపల్లి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోటపలుకుల వెంకట్పై ఛీటింగ్, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News
BBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
BBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా స్మైల్ స్పెషల్ స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన, ఆమోదం, సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైన ప్రతిభతో, సామర్థ్యంతో ఉండే వ్యక్తి. వారి ప్రత్యేకతలను గౌరవిస్తూ, ప్రేమ, సహనం, అర్థం చేసుకునే మనస్తత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆటిజం ఒక వ్యాధి కాదు, అది ఒక భిన్నమైన ప్రపంచాన్ని చూసే విధానం మాత్రమే. కాబట్టి వారిని మార్చే ప్రయత్నం కాకుండా, వారితో ఉండడం, వారిని అర్థం చేసుకోవడం సమాజ బాధ్యత. “లేబుల్ కాదు, సామర్థ్యాన్ని చూడాలి” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ప్రతి ఒక్కరూ కలిసి సహకరిస్తే సమానత్వంతో కూడిన మంచి సమాజాన్ని నిర్మించవచ్చు.
పాఠశాల నిర్వహణ:
శ్రీమతి పి. లక్ష్మి నీలిమ – స్థాపకురాలు మరియు చైర్మన్
శ్రీ ఉదయ్ ఐతరాజు – డైరెక్టర్
శ్రీమతి దివ్య గోకుల్ – ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్
శ్రీమతి శ్రావణి రావీతి – వైస్ ప్రిన్సిపల్
News
BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ
BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ
Adilabad జిల్లా బిసి అభివృద్ధి అధికారిగా ధారావత్ సోనియా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ Rajarshi Shah గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ కార్యకలాపాలపై చర్చించగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.
పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో బిసి వర్గాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు సేవాభావంతో విధులు నిర్వహించాలని సోనియాకు మార్గనిర్దేశం చేశారు.
-
News21 hours agoరూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
-
Telangana2 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Telangana2 weeks agoమంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి
-
Telangana3 weeks agoఘనంగా రిమ్ జిమ్ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం
-
Police News20 hours agoBBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
-
Telangana3 weeks agoఉప్పల్లో హత్య కేసు ఛేదన… 6 గంటల్లో ఇద్దరు నిందితులు అరెస్ట్
-
india1 week agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
-
Telangana2 weeks agoత్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి ప్రకటన
