Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు :జిల్లా ఎస్పి అశోక్ కుమార్

Published

on

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు :జిల్లా ఎస్పి అశోక్ కుమార్

 

గంజాయి తో పట్టుబడ్డ ముగ్గురికి 7 సం” జైలు

 

₹10,000 జరిమాన…

 

 

 

బిబిఎంఏ న్యూస్ / జగిత్యాల

జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కరికీ ₹10,000 జరిమానా విధించారు.

 

నిందితుల వివరాలు:

 

A1: కిన్నరి @ మేకల రాజు, వయసు 29, చిలుకవాడ నివాసం

 

A2: ఆర్ముల్ల సాయి కుమార్, వయసు 22, జగిత్యాల టౌన్

 

A3: మడవి చందు, వయసు 22, ఆసిఫాబాద్

 

 

కేసు వివరాల ప్రకారం, 28-09-2024 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పట్టణ పోలీసులకు న్యూ బస్టాండ్ సమీపంలోని బాంబే షాపింగ్ మాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు. అతను పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశీలనలో అతని వద్ద 250 గ్రాముల గంజాయి గుర్తించబడింది. విచారణలో అతను తన స్నేహితులు ఆర్ముల్ల సాయి కుమార్, మడవి చందు తో కలిసి అధిక లాభాల కోసం గంజాయి కొనుగోలు చేసి అమ్మకానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు.

 

కేసులో సేకరించిన ఆధారాలు, నిందితుల ఒప్పుకోవడం, సాక్ష్యాల ఆధారంగా, న్యాయమూర్తి నారాయణ 7 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు.

 

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ.. నిందితుల చర్యలు చట్టవిరుద్ధమే కాక, సమాజానికి హానికరమైనవని, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటారని, ఇలాంటి నేరాలకు పాల్పడినవారెవ్వరూ శిక్ష తప్పించుకోలేరని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చట్టం పాటించి సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని సూచించారు.

 

ఈ కేసులో నిందితుల శిక్ష సాధించడంలో కృషి చేసిన జగిత్యాల టౌన్ సిఐ కిషోర్, పి.పి. కే. మల్లేశం గౌడ్, సి.ఎం.ఎస్. ఎస్సై ఎస్. శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్‌లు శ్రీనివాస్, మహేంద్ర, కానిస్టేబుల్‌లు రాజు నాయక్, కిరణ్ కుమార్‌లను ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే తెలంగాణ: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

Published

on

పెద్దపల్లి, జూన్ 2 (బిబిఎంఏ న్యూస్):

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించి రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

స్వపరిపాలనతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. వ్యవసాయం, విద్య, పారిశ్రామిక రంగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, జిల్లా కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

News

తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం: సీపీ అంబర్ కిషోర్ ఝా

Published

on

 

రామగుండం, జూన్ 2 ( బిబిఎంఏ న్యూస్):

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎందరో అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను సీపీ ప్రదానం చేశారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్, వివిధ విభాగాల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Published

on

జగిత్యాల, జూన్ 2 (బీబీఎంఏ న్యూస్): జగిత్యాల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మంత్రివర్యులకు పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన ఎస్పీ, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజా భద్రతకు సంబంధించి చేపడుతున్న చర్యలపై సంక్షిప్తంగా వివరించినట్లు సమాచారం. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Continue Reading

Trending