Connect with us

Sports

గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..

Published

on

గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..

 

సాఫ్ట్‌బేస్‌ జాతీయ స్థాయిలో రెండో స్థానం..

 

బిబిఎంఎ న్యూస్ / పెద్దపల్లి, నవంబర్ 14:

గాయత్రి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ఏ లాస్యప్రియ్, ఏ మహిమ (9వ తరగతి) మహారాష్ట్రలో ఈ నెల 7 నుండి 9 వరకు జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్‌బేస్ బాల్ క్రీడల్లో ద్వితీయ స్థానం సాధించి తెలంగాణకు, పెద్దపల్లికి ప్రతిష్ఠ తెచ్చారు.

 

ఈ విజయం పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యార్థుల కృషి, పట్టుదలని ప్రశంసించి అభినందించారు. గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థులు జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని, క్రీడల పట్ల ఆసక్తి, నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అల్లంకి రజనీ దేవి, ప్రిన్సిపాల్ విజయ్, కోచ్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

రాష్ట్రస్థాయిలో గెలుపొందిన  గద్వాల్ జిల్లా కుర్రాళ్ల ను అభినందించిన డిజిపి, ఎస్పీ

Published

on

రాష్ట్రస్థాయిలో గెలుపొందిన  గద్వాల్ జిల్లా కుర్రాళ్ల ను అభినందించిన డిజిపి, ఎస్పీ

 

గద్వాల్ జిల్లాకు గర్వకారణం అభినందించిన డీజీపీ

శివధర్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు

 

బీబీఎంఏ న్యూస్

గద్వాల్, నవంబర్ 14: చిన్న పట్టణం నుంచి పెద్ద లక్ష్యాలను అందుకుంటూ ముందుకు సాగిన గద్వాల్ జిల్లా యువకులు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి జిల్లాకు గౌరవం తీసుకువచ్చారు. తమ ప్రతిభతో మెరిసిన ఈ పల్లెటూరి కుర్రాళ్లను రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

 

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కూడా యువత విజయాన్ని ప్రశంసిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన యువత కష్టపడి సాధించిన ఈ విజయంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ విజయం జిల్లాలోని ఇతర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Continue Reading

india

భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం తొలి వరల్డ్ కప్ కైవసం

Published

on

భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం తొలి వరల్డ్ కప్ కైవసం

 

లండన్, నవంబర్ 2 (బిబిఎంఎ న్యూస్):

మహిళల క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణాక్షరాల ఘట్టం సృష్టిస్తూ భారత మహిళల జట్టు 2025 ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి తొలి వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

 

టోస్ గెలిచి రన్‌ఫెస్ట్

 

లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఈ ఫైనల్‌లో భారత్ టోస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ (87) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, ఆత్మవిశ్వాసంతో కూడిన దీప్తి శర్మ (58) సహకారం అందించింది. స్మృతి మంధానా (42), జెమిమా రోడ్రిగ్స్ (36) సైతం వేగంగా రాణించారు.

భారత జట్టు 50 ఓవర్లలో 298/7 పరుగులు చేసింది.

 

బౌలర్ల బృందం అదరగొట్టింది

 

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు భారత్ బౌలర్లు ఎదురొడ్డి నిలబడ్డారు. రేణుకా సింగ్ 3 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు, పూజా వస్త్రకర్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని చిత్తు చేశారు. లౌరా వోల్వార్డ్ (102) మాత్రమే ప్రతిఘటించినా, దక్షిణాఫ్రికా 45 ఓవర్లలో 246/9 వద్ద నిలిచిపోయింది.

 

భారత మహిళల చరిత్రాత్మక ఘనత

 

ఈ విజయంతో భారత్ తొలిసారిగా మహిళల ప్రపంచకప్ గెలిచిన జట్టుగా నిలిచింది. ఇంతకుముందు 2005, 2017 లో భారత్ రన్నరప్ గా నిలిచింది. ఈసారి కపిల్ దేవ్ 1983లో సాధించిన మగజట్టు విజయాన్ని మాదిరిగా మహిళల జట్టు కూడా చరిత్రను సృష్టించింది.

 

విజయం వెనుక కష్టసాధ్యమైన ప్రయాణం

భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లను ఓడించి ఫైనల్‌కు చేరింది. ప్రతి మ్యాచ్‌లో స్మృతి, షఫాలీ, దీప్తి, పూజా వస్త్రకర్, రేణుకా సింగ్ కీలక పాత్ర పోషించారు.

 

జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ ఇది ప్రతి భారత అమ్మాయి కోసం సాధించిన విజయం. ఈ కప్‌ మన స్ఫూర్తి, కష్టం, ఐక్యతకు నిదర్శనం” అని అన్నారు.

 

ప్రైజ్ మనీ & అభినందనలు

 

ఈ విజయంతో భారత మహిళల క్రికెట్ బోర్డుకు భారీ గౌరవం దక్కింది. ఐసీసీ ఈసారి మొత్తం USD 13.88 మిలియన్ ప్రైజ్‌మనీ ప్రకటించింది. విజేత భారత్‌కు USD 3 మిలియన్ (దాదాపు రూ.25 కోట్లు) బహుమతిగా లభించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్, క్రికెట్ దిగ్గజాలు సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీలు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

 

భారత మహిళల క్రికెట్‌కి కొత్త దిశ

 

ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో మలుపు తిరిగే క్షణం. చిన్న పట్టణాల నుంచి వచ్చి ప్రపంచాన్ని గెలిచిన ఈ ఆటగాళ్ల జట్టు ప్రతి బాలికకు ప్రేరణగా నిలుస్తోంది.

భవిష్యత్తులో మహిళల ఐపీఎల్, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు ఈ విజయం మరింత బలాన్నిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

బిబిఎంఎ స్పోర్ట్స్ డెస్క్

(Source: ICC, TOI, Deccan Herald, Cricbuzz, Hindustan Times)

 

 

 

Continue Reading

Sports

రాజకీయ రంగు పులుముకున్న ఆసియా కప్ విజయం

Published

on

By

దుబాయ్‌: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో భారత్ సాధించిన ఘనవిజయం కేవలం క్రీడా స్ఫూర్తికే పరిమితం కాలేదు. ఈ గెలుపు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది.

ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇటీవల జరిగిన “ఆపరేషన్ సిందూర్” ను పోల్చుతూ, “మైదానంలోనూ ఫలితం అదే – భారత్ గెలుపే” అని వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి అనంతరం మే 7, 2025న సాయుధ దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో తీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని త్రివిధ దళాలు సంయుక్తంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే.

ఫైనల్లో తిలక్ వర్మ (69 నాటౌట్), కుల్‌దీప్ యాదవ్ కీలక ప్రదర్శనలతో భారత్ తొమ్మిదో టైటిల్ దక్కించుకుంది. ఈ విజయాన్ని హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు *“కొత్త భారత గర్వకారణం”*గా కొనియాడారు. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా జట్టు అజేయంగా టోర్నమెంట్ ముగించిన విషయాన్ని ప్రశంసించారు. రాష్ట్ర నేతలూ ఈ గెలుపును దేశ గౌరవంగా పేర్కొన్నారు.

అయితే, ఫైనల్ అనంతరం వివాదం మళ్లీ చెలరేగింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ స్కిప్పర్ సల్మాన్ ఆఘాతో చేతులు కలపకపోవడం, అలాగే పిసిబి చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేత ట్రోఫీ స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించడంతో వేదికపై ఉద్రిక్తత నెలకొంది. చివరికి ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు జరిపారు.

వివాదాలతో నిండిన టోర్నమెంట్‌

ఈసారి ఆసియా కప్ మొదటి నుంచే రాజకీయ చర్చలతో ముడిపడింది. పహల్గాం దాడి అనంతరం పలు ప్రతిపక్ష పార్టీలు భారత్-పాక్ మ్యాచ్‌లను బహిష్కరించాలంటూ డిమాండ్ చేశాయి. శివసేన (యుబిటి), కాంగ్రెస్, తృణమూల్ నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్, తృణమూల్ నేత కల్యాణ్ బెనర్జీ జయ్‌షా పాత్రను ప్రశ్నించారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ “నిజమైన దేశభక్తుడు ఈ మ్యాచ్ చూడడు” అని వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ టోర్నమెంట్ కావడంతో వెనక్కు తగ్గడం సాధ్యం కాదని మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్ల సంబరాల్లో గన్ ఫైర్, ఫైటర్ జెట్ అనుకరణలు వివాదాస్పదమయ్యాయి. ఫైనల్లో బుమ్రా కూడా రౌఫ్ ఔటైనప్పుడు “ప్లేన్ క్రాష్” యాక్ట్ చేసి దానికి బదులిచ్చాడు.

మ్యాచ్ రిఫరీపై పిసిబి అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ప్రదర్శన కార్యక్రమంలో ఆలస్యం, చివరికి భారత జట్టు ట్రోఫీ స్వీకరించకపోవడం– ఇలా క్రికెట్ కంటే వివాదాలు ఎక్కువగా దృష్టి ఆకర్షించాయి.

Continue Reading

Trending