Police News
POLICE E:NEWS BBMA//सीतामढ़ी में बिहार पुलिस की बड़ी कार्रवाई : 07 किलो अवैध मादक पदार्थ के साथ 02 तस्कर गिरफ्तार
POLICE E:NEWS BBMA//
सीतामढ़ी में बिहार पुलिस की बड़ी कार्रवाई : 07 किलो अवैध मादक पदार्थ के साथ 02 तस्कर गिरफ्तार
अवैध मादक पदार्थों के खिलाफ चलाए जा रहे विशेष अभियान के तहत Bihar Police ने बड़ी सफलता हासिल की है। दिनांक 09 मई 2026 को सीतामढ़ी जिले के कन्हौली थाना क्षेत्र में गुप्त सूचना के आधार पर पुलिस द्वारा त्वरित कार्रवाई की गई। इस दौरान दो तस्करों — राकेश पासवान एवं राकेश राउत — को गिरफ्तार किया गया। पुलिस ने इनके कब्जे से लगभग 07 किलोग्राम अवैध मादक पदार्थ बरामद किया, जिसकी अनुमानित कीमत करीब ₹3,50,000 बताई जा रही है। साथ ही तस्करी में प्रयुक्त एक मोटरसाइकिल भी जब्त की गई है।
इस सफल कार्रवाई से क्षेत्र में अवैध नशे के कारोबार पर प्रभावी रोक लगाने में मदद मिलेगी। बिहार पुलिस ने स्पष्ट किया है कि राज्य में मादक पदार्थ तस्करों के खिलाफ अभियान लगातार जारी रहेगा और कानून व्यवस्था से खिलवाड़ करने वालों पर सख्त कार्रवाई की जाएगी।
T.S. CRIME CHIEF OFFICER
B. RAMESH
LEGAL ADVISORS :-
SHRI. T. RAVI KUMAR MURTHY, IPS (RETD DIG)
Smt. I. K. ANNAPURNA (CGC FOR HIGH COURT AP)
Directors
K. Srinivas Murthy
K. Padmalatha
S. Srinivas
M. Bhaskar
Web Platforms:-
🌐 www.bbmanews.com
🌐 www.policenewsbbma.com
🌐 www.policebbmanews.com
Digital Platforms:-
📱 Play Store App: BBMA News
📰 E-Paper: epaper.bbmanews.com
RUNNING STATES:-
AP & TS & KARNATAKA & DELHI & ODISHA & UP & BIHAR
ADMIN:-
B. RAMESH
News
రోడ్లపై చెట్లు… పరిస్థితులను సమీక్షించిన సీపీ
గాలి వానతో రోడ్లపై చెట్లు… వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు
బిబిఎంఏ న్యూస్/రామగుండం: అకాల గాలి వర్షం ప్రభావంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్లపై కూలిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలగగా, పోలీసులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎం. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్ కలిసి మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో రోడ్లపై పడిన చెట్లను తొలగించారు.
అనంతరం సీపీ దండేపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో గోడలు కూలి నలుగురు మృతి చెందిన ఘటనలను పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News
డీజీపీగా సీవీ ఆనంద్.. శివధర్ రెడ్డి సేవలకు ప్రశంసలు
డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్.. శివధర్ రెడ్డి సేవలకు ప్రశంసలు
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీవీ ఆనంద్ మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం పదవీ విరమణ పొందుతున్న సీనియర్ పోలీస్ అధికారి శివధర్ రెడ్డి సేవలను ఆయన కొనియాడారు.
32 సంవత్సరాలపాటు పోలీస్ శాఖలో శివధర్ రెడ్డి అందించిన సేవలు అమూల్యమని ఆనంద్ పేర్కొన్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, మావోయిస్టుల లొంగుబాటులో కీలకపాత్ర పోషించారని తెలిపారు. భారీ స్థాయిలో ఆయుధాల స్వాధీనం వంటి విజయాలు రాష్ట్ర భద్రతకు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారని కొనియాడారు.
ఇక రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రధాన సవాళ్లుగా మారాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.
2016 నుంచి తనతో కలిసి పనిచేసిన అధికారుల అనుభవంతో టీమ్ వర్క్గా ముందుకు సాగుతామని, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడటంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
News
అచలాపూర్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
బిబిఎంఏ న్యూస్ /తాండూర్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తాండూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అచలాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సీఐ దేవయ్య, ఎస్ఐ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు భద్రత, నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా 40 బైక్లను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. సైబర్ మోసాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోరాదని హెచ్చరించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం దూరంగా ఉండాలని యువతకు సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలని, ధృవీకరించిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని చెప్పారు.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామాల్లో భద్రత పెంపొందించవచ్చని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
News2 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News3 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
News4 days agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment9 hours agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
News4 days agoరోడ్లపై చెట్లు… పరిస్థితులను సమీక్షించిన సీపీ
-
india2 weeks agoనేడే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ,
-
Telangana4 days agoలక్షెట్టిపేట గోడకూలి నలుగురు రైతులు మృతి
