Police News
POLICE NEWS BBMA// పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చి హత్యాయత్నం – తండ్రి, రెండో భార్య అరెస్ట్
POLICE NEWS BBMA// పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చి హత్యాయత్నం – తండ్రి, రెండో భార్య అరెస్ట్
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. అనిత అనే మహిళ తన ఇద్దరు చిన్న కుమారులతో జీవిస్తుండగా, ఆమె భర్త శ్రీనివాస్ సంవత్సరం క్రితం మమతను రెండో పెళ్లి చేసుకున్నాడు. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీ ప్రకారం పిల్లల పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేశారు.
ఆ భూమిని తిరిగి తనకు ఇవ్వాలని శ్రీనివాస్ తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడు. తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి అతడు ఘోర కుట్ర పన్నాడు. రెండో భార్య మమతతో కలిసి పిల్లలను హతమార్చాలని యోచించి, ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి విషం కలిపిన బిస్కెట్లు తినిపించేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ వ్యక్తి మానవత్వంతో స్పందించి విషయాన్ని అనితకు తెలియజేయడంతో, ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాస్, మమతలను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
News
ఫోన్ కాల్తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ ఉద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆయన భార్య గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, ఉద్యోగరీత్యా పరకాల పట్టణంలో నివాసం ఉంటున్నారు.
నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మహ్మద్ షరీఫ్ ఉద్దీన్కు ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వెల్లంపల్లి రోడ్డులో ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Police News
POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “సేవా పథకం”లకు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బంది ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపికైన అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.
విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు సహజంగానే లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు చట్టపరిధిలో ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్నత విలువలతో విధులు నిర్వర్తించే వారికి ప్రభుత్వ గుర్తింపు, ప్రజల ప్రశంసలు దక్కుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక సేవా పథకాలకు ఎంపిక కావడం ప్రతి పోలీస్ అధికారికి గౌరవప్రదమైన విషయమని, ఈ అవార్డులు శాఖలోని ఇతర సిబ్బందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
సేవా పథకాలకు ఎంపికైన వారిలో ఇన్స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఏఆర్ఎస్ఐ టి. సూర్య ప్రకాష్తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు మొహమ్మద్ అబ్దుల్ కలీమ్, పీ. రాజయ్య, ఆర్. నర్సింగరావు, సీహెచ్. శేఖర్, ఆర్. శేఖర్, ఎ. శ్రీనివాస్ మరియు కానిస్టేబుళ్లు ఎం. కిరణ్ కుమార్, కె. జలపతి ఉన్నారు. ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
News
తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం: సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం, జూన్ 2 ( బిబిఎంఏ న్యూస్):
రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎందరో అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను సీపీ ప్రదానం చేశారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్, వివిధ విభాగాల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
crime3 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana2 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment4 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime3 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime3 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News4 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
