Sports
ట్రోఫీ లేకుండా భారత్ ఆసియా కప్ సంబరాలు
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై విజయం సాధించిన టీమ్ ఇండియా, వింతగా ట్రోఫీ లేకుండా సంబరాలు జరుపుకుంది. ఆటగాళ్లు ఎవ్వరూ మెడల్స్ ధరించలేదు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో కప్ కూడా లేదు. కారణం– భారత జట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మరియు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేత ట్రోఫీ తీసుకోవడాన్ని నిరాకరించింది.
మొహ్సిన్ నక్వీ పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రిగా కూడా వ్యవహరిస్తుండటం, అలాగే టోర్నమెంట్ సమయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సూర్యకుమార్ మాట్లాడుతూ– “మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఎవ్వరూ మాపై ఒత్తిడి చేయలేదు. కానీ గెలిచిన జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడం చాలా విచిత్రం. ఇంతకాలం క్రికెట్లో ఇలాంటిదేమీ చూడలేదు” అని అన్నారు.
భారత్ అధికారులు ట్రోఫీని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖాలిద్ అల్ జరూని చేతుల్లో నుంచి స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, నక్వీ అనుమతి ఇవ్వకపోవడంతో ట్రోఫీ దూరమైంది. దాంతో ఆసియా కప్ ఫైనల్ తర్వాత సుమారు గంట ఆలస్యంగా జరిగిన కార్యక్రమంలో ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే ఫొటోలు దిగారు.
భారత్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, ట్రోఫీ మాత్రం వేదికపై లేకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
పాకిస్తాన్ కెప్టెన్ అసంతృప్తి
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, భారత జట్టు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. “ట్రోఫీ తీసుకోకపోవడం, చేతులు కలపకపోవడం వంటివి కేవలం మాకు అవమానం కాదు, క్రికెట్ అనే ఆటకే అవమానం. ఇలా ఇతర జట్లు కూడా చేస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుంది?” అని ఆయన ప్రశ్నించారు.
మ్యాచ్ హైలైట్స్
టోర్నమెంట్ డ్రామాకి మించి, ఫైనల్లో మాత్రం భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయలో పాకిస్తాన్ 113/1 నుంచి 146కి కుప్పకూలింది. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యం చేధించింది. తిలక్ వర్మ 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
News
మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, జూన్ 2 (బీబీఎంఏ న్యూస్): జగిత్యాల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మంత్రివర్యులకు పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.
జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అజారుద్దీన్ను కలిసిన ఎస్పీ, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజా భద్రతకు సంబంధించి చేపడుతున్న చర్యలపై సంక్షిప్తంగా వివరించినట్లు సమాచారం. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్ రెడ్డి
బిబిఎంఏ న్యూస్
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని సీఎం తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను మరింత సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక, సామాజికంగా వారిని బలోపేతం చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన పాలనను అందిస్తూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునే సందర్భమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
News
బాల్క సుమన్ అరెస్ట్.. నాంపల్లి కోర్టుకు తరలింపు!
హైదరాబాద్, మే 30 (బీబీఎంఏ న్యూస్):
బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
మూడు రోజుల క్రితం సింగరేణి అంశంపై మాట్లాడిన బాల్క సుమన్, సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని వ్యాఖ్యానించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మిలిటెంట్ తరహాలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ నమోదైన కేసుల ఆధారంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాల్క సుమన్ను హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే తన అరెస్ట్ వార్తలను బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు.
-
crime3 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana2 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment3 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime3 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime3 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News4 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
