Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

crime

బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు

Published

on

హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

ప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్

Published

on

బిబిఎంఏ న్యూస్/ 8 ఇంక్లైన్ కాలనీ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-II టౌన్ పోలీసులు దళిత యువకుడు జూల వంశీ హత్య కేసును వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి టాటా జెస్ట్ కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తెలిపారు. సోమవారం గోదావరిఖని-II టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌రావుతో కలిసి ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ ఈ నెల 29న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోవడంతో, అతని తల్లి జూల శంకరమ్మ మే 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీడీఆర్, మొబైల్ కాల్ వివరాలను పరిశీలించగా అలేఖ్య, నీలం నవీన్, బుర్ర భాస్కర్‌లపై అనుమానం వ్యక్తమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. వంశీ, అలేఖ్య పదో తరగతి సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం అలేఖ్య నీలం నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల వంశీ అలేఖ్యను తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో వేధించడంతో పాటు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి గొడవలకు దిగినట్లు తెలిసింది. దీంతో ముగ్గురు కలిసి వంశీని హత్య చేయాలని పథకం రచించారు.

పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్ చేసి వంశీని హైదరాబాద్‌కు రప్పించారు. భాస్కర్ ఫ్లాట్‌లో మద్యం తాగించిన అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న కత్తితో ఛాతి, మెడ భాగాల్లో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మంథని మండలం గాడుదులగండి ప్రాంతంలోని లోయలో పడవేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు.

Continue Reading

crime

అతివేగం బలి.. మహబూబ్‌నగర్‌లో ఐదుగురు మృతి

Published

on

యువకుల బైక్ రేసింగ్ సరదా.. ఐదుగురి ప్రాణాలు బలి

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అతివేగం, బైక్ రేసింగ్‌లే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. స్పోర్ట్స్ బైక్ సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కారును ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక బైపాస్ రోడ్డు బైక్ రేసింగ్‌లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Continue Reading

crime

BBMA POLICE E:NEWS// అనంతపురం హత్య కేసులో ట్విస్ట్ – నిందితుడిపై పోలీసుల కాల్పులు

Published

on

By

BBMA POLICE E:NEWS// అనంతపురం హత్య కేసులో ట్విస్ట్ – నిందితుడిపై పోలీసుల కాల్పులు

BBMA POLICE E:NEWS// అనంతపురం హత్య కేసులో ట్విస్ట్ – నిందితుడిపై పోలీసుల కాల్పులు

అనంతపురం జిల్లా కోనుప్పలపాడులో బాలుడి హత్య కేసు దర్యాప్తులో సంచలన మలుపు చోటుచేసుకుంది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు సర్వేష్‌ అకస్మాత్తుగా పోలీసులపై తిరగబడ్డాడు. అక్కడే పడివున్న బీర్‌ బాటిల్‌తో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ దాడి ఆపకపోవడంతో, ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో సర్వేష్‌కు రెండు కాళ్లలో బుల్లెట్‌ గాయాలు కావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడిలో సీఐ బోయ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్‌ కూడా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పరిణామం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#Anantapur #Konuppalapadu #PoliceFiring #CrimeNewsAP

Continue Reading

Trending