Politics
ఏపీ అగ్రగామిగా అన్ని రంగాలలో ఉండాలని కోరుతారు
అదేంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ రోజూ ఏపీ అగ్రగామిగా అన్ని రంగాలలో ఉండాలని కోరుతారు కదా. దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని చెబుతారు కదా ఏపీ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉండాలని కూడా గట్టిగా కోరుతూంటారు కదా మరి అదేంటి ఏపీ నంబర్ వన్ అంటే నో చెప్పేస్తున్నారు అనుకోవచ్చు, పొర పడవచ్చు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడూ ఏపీ నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించే నాయకుడే. అయితే అదే సమయంలో ఆయన ఏపీని ఇబ్బంది పెట్టే అంశాలలో రాష్ట్రం జీరో ర్యాంక్ లోనే ఉండాలని కోరుకుంటారు. ప్రజా కోణం లో నుంచి చూసి ఆలోచించే నాయకుల తీరు అలాగే ఉంటుంది. అందుకే నిండు సభలో బాబు ఏపీకి నెంబర్ వన్ ప్లేసా వద్దే వద్దు అని అంటున్నారు. ఇంతకీ ఏపీకి దేంటో నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది, ఏమిటి ఆ కధ అంటే అదొక డిఫరెంట్ స్టోరీ. తెలుసుకోవాల్సిందే. ఏపీ అసెంబ్లీలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మీద జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం మీద పెడుతున్న శ్రద్ధ గురించి సర్కార్ తీసుకుంటున్న చర్యల గురించి సవివరంగా తెలియచేశారు. అదే సమయంలో ఆయన కొన్ని విషయాలలోమాత్రం ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. వాటి తీరు మారాలన్నది ఆయన ఆలోచనా విధానంగా అదే సర్కార్ లక్ష్యంగా కూడా చెప్పుకొచ్చారు. ఇక ఏపీ ఆరోగ్య సంరక్షణ కానీ ప్రమాణాలు కానీ చూసుకుంతే కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే మెరుగ్గా ఏపీలో ఆరోగ్య మౌలిక వసతుల కల్పన ఉందని బాబు వివరించారు. ఇక ఏపీలో మొత్తంగా ఒక లక్షా 15 వేల ,499 మంది డాక్టర్లు అలాగే, 70 వేల 43 మంది నర్సులు ఉన్నారని తెలిపారు. ఇక దేశంలో చూస్తే కనుక పౌరుల సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉందని బాబు చెప్పారు. అదే విధంగా ఏపీ వ్యాప్తంగా 78 శాతం డిజిటల్ హెల్త్ రికార్డులు చేశామని, త్వరలో హెల్త్ రికార్డులను 100 శాతం డిజిటలైజ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అదన్న మాట మ్యాటర్. బాబు వద్దు అన్నది కూడా ఇదే. దేశంలో చూసుకుంటే కనుక ఏపీ సిజేరియన్ కాన్పులలో నంబర్ వన్ గా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. ఇది చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఏపీలో చూసుకుంటే ఇటీవల కాలంలో డాక్టర్లు సిజేరియన్ కాన్పులు ఎక్కువగా చేస్తున్నారని బాబు అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో పది శాతం జరుగుతూంటే తొంబై శాతం పైగా సిజేరియన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని ఆయన డేటా చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిండు సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఆయన ఆవేదన మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కూడా వ్యక్తం అయింది. భగవంతుడు ఇచ్చిన శరీరానికి అనవసరంగా ఆపరేషన్లు చేయడం సరికాదని బాబు స్పష్టం చేశారు. తేదీలు చెప్పి మరీ సిజేరియన్లు చేస్తున్నారని బాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ముహుర్తాలు పెట్టుకుని సీజేరియన్ ఆపరేషన్లు చేసే పరిస్థితి వచ్చిందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఏపీ వ్యాప్తంగా సీజేరియన్ ఆపరేషన్లను తగ్గించేలా చూడాలని వైద్యారోగ్య శాఖ మంత్రిని ఆయన కోరారు. అంతే కాదు సీజేరియన్ ఆపరేషన్ల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులతో మాట్లాడతామని, అవసరమైతేనే ఆపరేషన్లు చేయాలని స్పష్టంగా చెబుతామని కూడా బాబు చెప్పడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ నుంచి ముఖ్యమంత్రి ఒక కీలకమైన కచ్చితమైన సందేశాన్ని కూడా ఏపీలోని వైద్యులకు పంపించారు. సాధారణ కాన్పులు జరిగేలా డాక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఇక మీదట అదే అందరి విధానం కావాలని పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలను విని ప్రభుత్వం ఆవేదనను అర్ధం చేసుకుని ఏపీలో సిజేరియన్ కాన్పుల విషయంలో అంతా వెనకడుగు వేయాలని కోరుతున్నారు. ఈ తరహా ఆపరేషన్లను జీరో నెంబర్ కి తీసుకుని వస్తే సంతోషం, లేదా పరిమితం చేసినా మంచిదే అని అంటున్నారు.
News
మేదరుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక దృష్టి
వెదురుతో చేతివృత్తులు, డెకరేషన్ రంగంలో పనిచేసేవారిని ఆదుకుంటాం: డీఎన్టీ బోర్డు కమిటీ సభ్యుడు భరత్ బాయ్
హైదరాబాద్, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 11:
వెదురుతో పనిముట్లు తయారు చేసే మేదరులు, డెకరేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందని కేంద్ర డీఎన్టీ డెవలప్మెంట్ బోర్డు కమిటీ సభ్యులు భరత్ బాయ్ తెలిపారు. నాగోల్లోని ఈషా ఫంక్షన్ హాల్లో తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భరత్ బాయ్ మాట్లాడుతూ వెదురుతో పనిముట్లు తయారు చేసే, డెకరేషన్ పనులు చేసే మేదరులను డీఎన్టీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సీడ్ పథకం ద్వారా అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, మేదరులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి డెకరేషన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నందికంటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ మాట్లాడుతూ మేదరుల కులవృత్తికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అందరూ సంఘటితమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ బీసీల అభివృద్ధికి కుల సంఘాల నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు రావినూతల శశిధర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కులవృత్తులు చేసే వారు మూలస్తంభాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో డెకరేషన్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎస్బీఐ ఏజీఎం రామకృష్ణుడు డెకరేషన్ కార్మికులకు ప్రమాద బీమా, ఎస్బీఐ బీమా పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డెకరేషన్ కార్మికులకు లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ నిర్వహించి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీఎంఎండీవీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఇందూరు గంగాధర్, డెకరేషన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతకోటి భిక్షపతి, కోశాధికారి పారాసాని ఈశ్వర్, ఉపాధ్యక్షులు, డీఎన్టీ నాయకులు, సంఘం ప్రతినిధులు, డెకరేషన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
News
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. శంకర్ గౌడ్ డిమాండ్
ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి
గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారులంతా పార్టీలు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర, జిల్లా మహిళా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా అనుముల కళావతి, కార్యదర్శిగా తోడేటి స్వరూప, ఉపాధ్యక్షులుగా కోడిపుంజుల జ్యోతి, గంగారపు శాంతలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల సరోజన, కార్యదర్శిగా పున్నం మంజులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
News
మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.
దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News5 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
