Police News
BBMA POLICE e:NEWS // పత్రిక ప్రకటన (Press Note) – సంగారెడ్డి జిల్లా పోలీస్ 📅 తేది: 10.04.2026
BBMA POLICE e:NEWS // పత్రిక ప్రకటన (Press Note) – సంగారెడ్డి జిల్లా పోలీస్
📅 తేది: 10.04.2026
📍 స్థలం: జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి
🚨 ముఖ్యాంశాలు:
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమాలు
📆 ఏప్రిల్ 13 నుండి 18 వరకు 6 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
👮 జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ IPS వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కీలక సూచనలు
🛣️ కార్యక్రమం లక్ష్యం:
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా “అరైవ్ అలైవ్” పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
📌 ఎస్పీ సూచనలు:
ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి (సర్పంచ్ & యువకులతో కలిసి)
గ్రామాల్లో ఉన్న ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి
డ్రైవర్లు డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానం పాటించాలి
📢 అవగాహన కార్యక్రమాలు:
ప్రమాదాల వీడియోలను LED స్క్రీన్లు & ఫ్లెక్సీలు ద్వారా ప్రదర్శించడం
గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ ద్వారా సందేశాలు
పోలీసు కళా బృందాల ద్వారా నాటికలు & ప్రచార కార్యక్రమాలు
📣 లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం
🚔 కఠిన చర్యలు:
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపైనా చలానాలు
పోలీసులే ముందుగా నియమాలు పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి
🚚 డ్రైవర్ యూనియన్లతో సమావేశాలు:
ఆటో, లారీ, బస్ డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి
ట్రాఫిక్ సమస్యలు & నియమాలపై చర్చ
🙏 ప్రజలకు పిలుపు:
“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో
👉 ప్రజలు
👉 విద్యార్థులు
👉 డ్రైవర్లు
👉 స్వచ్ఛంద సంస్థలు
అందరూ చురుకుగా పాల్గొని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాలను తగ్గించేందుకు సహకరించాలి అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
✅ సారాంశం:
ఈ 6 రోజుల కార్యక్రమం ద్వారా సంగారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించడం లక్ష్యం.
News
బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య
ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
జనగామ, బీబీఎంఏ న్యూస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.
News
తాండూర్ సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ.. సీపీ
తాండూర్ సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ.. నా•ణ్యమైన దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని ఆదేశం
మంచిర్యాల, బీబీఎంఏ న్యూస్, జూలై 24: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను నిష్పాక్షికంగా విచారించి చట్టబద్ధంగా పరిష్కరించాలని, ప్రజలపై అనవసర బలప్రయోగానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
ప్రతి పోలీసు అధికారి సీసీటీఎన్ఎస్, ఐటీ, ఆధునిక పోలీసింగ్ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించి చట్టపరిధిలో న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
crime
రెడ్కో డివిజినల్ ఇంజనీర్పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు
(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News7 days agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 days agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
