Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

BBMA POLICE E:NEWS // గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Published

on

BBMA POLICE E:NEWS // గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

BBMA POLICE E:NEWS // గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

విద్యుత్ బకాయిల వివాదానికి సంబంధించి GITAM (Deemed to be University) కు Supreme Court of India కీలక సూచనలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా రూ.15 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఈ వ్యవహారంలో Telangana High Court డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును యూనివర్సిటీ సవాల్ చేయగా, విద్యుత్ సరఫరా సంస్థ Southern Power Distribution Company of Telangana Limited తమ వాదనలు వినిపించింది. వీబీసీ మరియు గీతం యూనివర్సిటీ పరస్పరం అనుబంధ సంస్థలేనని సంస్థ పేర్కొంది. సుమారు రూ.118 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు తాత్కాలిక ఉపశమనం అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి

Published

on

హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ ఉద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆయన భార్య గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, ఉద్యోగరీత్యా పరకాల పట్టణంలో నివాసం ఉంటున్నారు.

నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మహ్మద్ షరీఫ్ ఉద్దీన్‌కు ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వెల్లంపల్లి రోడ్డులో ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Continue Reading

News

ప్రజల గుండెల్లో నిలిచిన అయిలయ్యకు వీడ్కోలు

Published

on

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సేవామూర్తి

రామగుండం, జూన్ 3 (బిబిఎంఏ న్యూస్ ):

రామగుండం ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు, రాజకీయ నాయకుడు గోపు అయిలయ్య యాదవ్ అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కోల్‌కతాలో గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం అందడంతో రామగుండం, గోదావరిఖని సహా పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు ఆయన మరణవార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

గోపు అయిలయ్య యాదవ్ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆయన సేవాభావం, మంచితనం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేయడం, పేద విద్యార్థుల విద్యకు అండగా నిలవడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహకారం అందించడం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు.

వ్యాపార రంగంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదిగిన ఆయన, సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని సాధ్యమైనంత మేర సహాయం చేసేవారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మూడు దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసిన ఆయన, అనంతరం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్ర సమితిలో రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు.

ప్రచార ఆర్భాటాలకు దూరంగా నిశ్శబ్దంగా సేవలు అందించిన అయిలయ్య యాదవ్ మరణం రామగుండం ప్రాంతానికి తీరని లోటుగా మారింది. ఒక మంచి మనిషిని, సేవాతత్పరుడిని, ఆపన్నహస్తాన్ని కోల్పోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“పదవులతో కాదు.. మంచితనంతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి గోపు అయిలయ్య యాదవ్” అంటూ పలువురు కన్నీటి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు.

Continue Reading

News

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే తెలంగాణ: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

Published

on

పెద్దపల్లి, జూన్ 2 (బిబిఎంఏ న్యూస్):

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించి రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

స్వపరిపాలనతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. వ్యవసాయం, విద్య, పారిశ్రామిక రంగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, జిల్లా కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

Trending