Police News
తీర్పు న్యాయం విజయం జిల్లా ఎస్పి : నితిక పంత్ ఐపీఎస్
మహిళను అక్రమ రవాణా చేసిన కేసులో నిందితులకు కఠిన శిక్ష ఖరారు.
ఈ తీర్పు న్యాయం విజయం జిల్లా ఎస్పి : నితిక పంత్ ఐపీఎస్
బిబిఎంఎ న్యూస్ /ఆసిఫాబాద్ : నవంబర్ 25:
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 లో జరిగిన మహిళ అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్ వివేక్ కఠిన శిక్ష విధించారు. ఒక నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, మిగతా ముగ్గురికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించబడింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.
వివరాల ప్రకారం, 01/07/2019న, ముగ్గురు వ్యక్తులు A1, గౌరు బాయి AZ, వెంకటి A3 హరి దాస్ (కానిస్టేబుల్) ద్వారా మహిళను మాయ మాటలతో పని ఇచ్చే వాదనలో మధ్యప్రదేశ్లోని లాలాగిరి గోస్వామి వద్దకు తరలించారు. బాధితురాలిని 1,30,000 రూపాయలకే అమ్మారు. కేసును బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తిర్యాని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఏ. అశోక్ నమోదుచేశారు.
కాగా, లాలాగిరి గోస్వామి బాధితురాలిని పలుమార్లు అత్యాచారం చేసి, తన వ్యవసాయ పొలంలో పనులు చేయించేవాడిగా తేలింది. ఎవరూ లేకపోవడం వల్ల 25/07/2019 న మహిళ తన ఇంటికి తిరిగి వచ్చారు.
వీటి ఆధారంగా డిఎస్పి ఏ. సత్యనారాయణ చార్జ్షీట్ సమర్పించారు. కోర్టులో ఏ ఎస్ఐ ఈశ్వర్ సింగ్ సాక్షులను హాజరుపరిచారు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం రమణారెడ్డి సాక్షులను విచారించి నేరాన్ని ధ్రువీకరించారు.
కోర్టు విచారణలో నేరం స్పష్టంగా రుజువు కావడంతో, ప్రధాన న్యాయమూర్తి కుమార్ వివేక్ A1, A2, A3 నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమానా, A4 (లాలాగిరి గోస్వామి) కు పదు సంవత్సరాల జైలు శిక్ష మరియు పది వేల రూపాయల జరిమానా విధించారు.
జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ, “ఈ తీర్పు న్యాయం విజయం మాత్రమే కాక, మహిళల రక్షణకు కీలకమైన ప్రేసెడెంటిల్ కేసుగా నిలుస్తుంది” అన్నారు.
News
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం
పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా
జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.
బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News
అర్ధరాత్రి చెక్పోస్ట్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
బిబిఎంఏ న్యూస్ / తాండూరు
బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జోన్ పరిధిలోని తాండూరు–రేపల్లెవాడ అంతర్ జిల్లా చెక్పోస్ట్ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
చెక్పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించిన డీసీపీ, వాహనాల తనిఖీ విధానాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పశువుల రవాణాకు సంబంధించిన అన్ని చట్టపరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్లో క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.
అక్రమ పశు రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద రవాణా గమనించిన వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
డీసీపీ వెంట తాండూరు సీఐ దేవయ్య, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూరు ఎస్ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
crime
బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
-
crime2 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment3 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment3 days agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
