News
BBMA POLICE E:NEWS// విశాఖలో 5వ వెహికల్ రిటర్న్ మేళా – 413 వాహనాల పంపిణీ
BBMA POLICE E:NEWS// విశాఖలో 5వ వెహికల్ రిటర్న్ మేళా – 413 వాహనాల పంపిణీ
విశాఖ పోలీస్ గ్రౌండ్లో Shankhabrata Bagchi గారు 5వ “వెహికల్ రిటర్న్ మేళా”ను నిర్వహించారు. వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను చట్టపరమైన ప్రక్రియ పూర్తైన అనంతరం సంబంధిత యజమానులకు తిరిగి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 413 వాహనాలను యజమానులకు అప్పగించడం జరిగింది. వాహన యజమానులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా మారింది. ప్రజల ఆస్తిని త్వరితగతిన తిరిగి అందించడం పోలీసుల ప్రజాసేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.
కమీషనర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు మరియు ప్రజల మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
@APPOLICE
crime
బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News
స్మోకింగ్ జోన్లపై గోదావరిఖని వన్టౌన్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
బిబిఎంఏ న్యూస్/ రామగుండం పోలీస్ కమిషనరేట్,
గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్మోకింగ్ జోన్లు, పాన్ షాపులు మరియు పబ్లిక్ ప్రదేశాల్లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వన్టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫజాలోద్దీన్ ఆయనతో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
స్మోకింగ్ జోన్లలో చట్టబద్ధ అనుమతులు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, మైనర్లకు సిగరెట్లు అమ్మకం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. టీ స్టాల్స్ పేరుతో యువతను మత్తు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News
నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ మడతరమేష్
నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ ఎం రమేష్
బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని మే 11
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హెచ్చరించారు. సోమవారం గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో గోదావరిఖని, రామగుండం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నేరచరిత్ర, జీవన విధానం, ఉద్యోగ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రౌడీ షీటర్లకు యూరిన్ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం నిర్ధారణైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవివర్మ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
-
crime7 hours agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News2 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News3 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment2 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
News5 days agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment1 day agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
-
News6 days agoరోడ్లపై చెట్లు… పరిస్థితులను సమీక్షించిన సీపీ
