Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

దొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక.. 

Published

on

ధర్మారం, మే 30 (బీబీఎంఏ న్యూస్):

ధర్మారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు హెచ్చరించారు. ఢిల్లీకి చెందిన దోపిడీ ముఠాలోని ఇద్దరు సభ్యులు పెద్దపల్లి పట్టణంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరు పెద్దపల్లి పరిసర ప్రాంతాలు, గ్రామాల్లో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్రామస్తులు, పట్టణ ప్రజలు తమ ఇళ్లు, ఆస్తుల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మారం ఎస్సై ప్రవీణ్ సూచించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు లేదా పోలీసులు విడుదల చేసిన ఫోటో, వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే వెంటనే ధర్మారం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ప్రజల అప్రమత్తత, సహకారంతోనే ఇటువంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

బాల్క సుమన్ అరెస్ట్.. నాంపల్లి కోర్టుకు తరలింపు!

Published

on

హైదరాబాద్, మే 30 (బీబీఎంఏ న్యూస్):

 

బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

 

మూడు రోజుల క్రితం సింగరేణి అంశంపై మాట్లాడిన బాల్క సుమన్, సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని వ్యాఖ్యానించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మిలిటెంట్ తరహాలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ నమోదైన కేసుల ఆధారంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

అయితే తన అరెస్ట్ వార్తలను బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు.

Continue Reading

News

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు

Published

on

 

ఈద్గాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

 

బిబిఎంఏ న్యూస్ : రామగుండం

 

బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, కరుణ, శాంతికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

 

పండుగ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఈద్గాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ తెలిపారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక బందోబస్తు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రేమ, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలంతా పరస్పర మతాలను గౌరవించుకుంటూ సోదరభావంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

 

సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించిన సీపీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని కోరారు.

Continue Reading

News

అర్ధరాత్రి మసీదులు, ఈద్గాల తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ

Published

on

బక్రీద్ వేడుకల కోసం మంచిర్యాలలో కట్టుదిట్టమైన భద్రత

బిబిఎంఏ న్యూస్ : మంచిర్యాల

బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి సమయంలో మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో మసీదులు, ఈద్గాలు, చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పండుగ విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడైనా చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సూచించారు.

బక్రీద్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీసీపీ తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

Continue Reading

Trending