Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

BBMA POLICE e:NEWS // BBMA: సంగారెడ్డి జిల్లాలో సైబర్ జాగ్రుకత దివాస్ – సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు

Published

on

BBMA POLICE e:NEWS // BBMA: సంగారెడ్డి జిల్లాలో సైబర్ జాగ్రుకత దివాస్ – సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు

జిల్లా పోలీస్ కార్యాలయం,

సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 04.03.2026

 

• సైబర్ జాగ్రుకత దివాస్–జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..

• సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే మార్గం.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

• సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జె.ఎన్.టి.యు లో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం..

 

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సైబర్ నేరాల నుండి విముక్తి కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా సైబర్ జాగ్రుకత దివాస్, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు.

 

మార్చి నెల మొదటి బుధ వారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు తేది: 04.03.2026 నాడు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రుకత దివాస్ పేరుతో ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో జె.ఎన్.టి.యు ఇంజెనీరింగ్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.

 

సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య అని, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అన్నారు. ఈజీ మనికి అలవాటు పడి, అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దని, ఈజీ మని అంటే మోసం అని గుర్తించాలని అన్నారు. సైబర్ నేరాలకు గురిఅవుతున్న వారిలో విధ్యావంతులే అధికం అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్, నకిలీ ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ వంటి ఆన్లైన్ మోసాల పట్ల అవగాహ కలిగి ఉండాలని, మొదట డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపించి, ఆతర్వాత ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని గుర్తించాలన్నారు.

 

అమాయక ప్రజల బలహీనతే, సైబర్ నేరాగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకొని మరిన్ని సైబర్ మోసాలు చేయడానికి అవకాశం ఉందని, సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చు అన్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఎవ్వరూ బయపడాల్సిన అవసరం లేదని, అసలు డిజిటల్ అరెస్ట్ ఉండదని అన్నారు. ఆన్లైన్ లో అపరిచిత్తులతో పరిచయాలకు దూరంగా ఉండాలని, తెలియని లింక్స్, ఎపికె ఫిల్స్ ఓపెన్ చేసి మోసపోవద్దని అన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే (గోల్డెన్ అవర్)/48 గంటలలోపు 1930 కు కాల్ చేసి గాని, యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో జె.ఎన్.టి.యు కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, D4C సిబ్బంది, కళాశాల యువత తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

BBMA POLICE E:NEWS – హనుమకొండ కలెక్టర్, ఇంచార్జి మంత్రితో భేటీ

Published

on

By

BBMA POLICE E:NEWS – హనుమకొండ కలెక్టర్, ఇంచార్జి మంత్రితో భేటీ

BBMA POLICE E:NEWS – హనుమకొండ కలెక్టర్ మర్యాదపూర్వక భేటీ

BBMA POLICE E:NEWS – హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ గారు హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. పరిపాలనను పారదర్శకంగా, ప్రజాకేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. జిల్లా పురోగతికి అవసరమైన సూచనలు మంత్రి గారు అందించినట్లు సమాచారం.

#Telangana #Hanamkonda #OfficialMeet

Continue Reading

Police News

BBMA POLICE E:NEWS – హిట్ అండ్ రన్ బాధితులకు రూ.1.50 లక్షల పరిహారం

Published

on

By

BBMA POLICE E:NEWS – హిట్ అండ్ రన్ బాధితులకు రూ.1.50 లక్షల పరిహారం

Visakhapatnam City Police – రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

BBMA POLICE E:NEWS – విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా హిట్ & రన్ ఘటనల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులకు ఆర్థిక సహాయం అందజేయబడింది. ప్రతి ఒక్కరికి రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,50,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడింది.

ఈ సహాయక కేంద్రం రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు 132 మంది బాధితులకు మొత్తం రూ.1,06,50,000 పరిహారం అందించబడింది.

రోడ్డు భద్రతపై అవగాహన పెంపు, బాధితులకు త్వరితగతిన సహాయం అందించడం పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు.

#AndhraPradeshPolice #RoadSafety #VictimSupport

Continue Reading

Police News

BBMA POLICE E:NEWS – బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రత్యేక డ్రైవ్

Published

on

By

BBMA POLICE E:NEWS – బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రత్యేక డ్రైవ్

BBMA POLICE E:NEWS – బాపట్ల జిల్లాలో ప్రత్యేక వాహనాల తనిఖీలు

BBMA POLICE E:NEWS – జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అరికట్టడం మరియు అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

అదే విధంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతాభావం కల్పిస్తూ, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం వంటి అంశాలపై అవగాహ

Continue Reading

Trending