Connect with us

Police News

ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్‌లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం

Published

on

ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్‌లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం

ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్!

 

●తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం

 

●హైదరాబాద్‌లో పకడ్బందీగా బాధితుల/పౌర కేంద్రీకృత విధానం అమలు

 

●నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వెల్లడి

 

నేర బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న చారిత్రాత్మక బాధితుల/పౌర కేంద్రీకృత విధానాన్ని హైదరాబాద్ నగరంలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు. తెలంగాణ సీఐడీ విభాగం రూపొందించిన నూతన ‘విక్టిమ్/సిటిజన్ సెంట్రిక్’ విధానం ప్రకారం.. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు అందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక ప్రయాసగా మారకూడదనే సదుద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ ఈ గొప్ప ముందడుగు వేసిందని అన్నారు.

 

ఈ నూతన విధానం అమలుపై బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో అవగాహన సమావేశం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో బాధితులకు త్వరతగతిన సేవలందించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, బాధితులు ఆసుపత్రిలో ఉన్నా సరే, పోలీసులు అక్కడికే వెళ్లి వివరాలు సేకరించి తక్షణమే కేసు నమోదు చేస్తారని తెలిపారు.

 

గతంలో ఘటన జరిగిన తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉండటం.. అప్పటికే మానసిక ఆందోళనలో ఉన్నవారికి మరింత ఇబ్బంది కలిగించేదని ఆయన గుర్తుచేశారు. ఈ పౌర కేంద్రీకృత విధానం వల్ల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, పోలీసులే స్వయంగా వారి వద్దకు వెళ్తారని స్పష్టం చేశారు.

 

ఈ విధానం అమలులో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధిత పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. అకారణంగా ఏ ఒక్క బాధితుడైనా పోలీస్ స్టేషన్ కు తిరగాల్సి వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి కేసును ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. బాధితుల గౌరవానికి, గోప్యతకు భంగం కలగకుండా ఈ సేవలను అందిస్తామని స్పష్టం చేశారు. బాధితుల/పౌర కేంద్రీకృత విధానం ప్రకారం ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 94906 16555 వివరాలు పంపాలని సూచించారు.

 

సైబర్ నేర బాధితుల కోసం ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించిన ‘సి-మిత్ర’తో పాటు, ఇప్పుడు ఈ నూతన విధానం కూడా ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని సీపీ తెలిపారు. పోలీస్ శాఖ ఖ్యాతిని పెంచేలా ఈ అద్భుతమైన విధానాన్ని రూపొందించిన డీజీపీ శ్రీ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్ గారికి, సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ గారికి సీపీ సజ్జనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

పీఆర్వో,

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

BBMA పోలీస్ ఈ-న్యూస్ | తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన మియాపూర్ పోలీసులు

Published

on

By

BBMA పోలీస్ ఈ-న్యూస్ | తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన మియాపూర్ పోలీసులు

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు

 

తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన మియాపూర్ పోలీసులు. @CybMypur ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన రాజేష్ కొడుకు సిద్ధార్థ్ (5) ఈరోజు ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ ఒక కిలోమీటర్ దూరం వెళ్లి తప్పిపోయాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మియాపూర్ పోలీసులు బాలుడిని గుర్తించి రెండు గంటల పాటు శ్రమించి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న నేపథ్యంలో పోలీసులే ముందస్తుగా తమ బాబును గుర్తించి వారికి క్షేమంగా అప్పగించడం పై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Continue Reading

Police News

BBMA పోలీస్ ఈ-న్యూస్ | వృద్ధురాలిని మోసం చేసి బంగారం అపహరించిన నిందితుడి అరెస్ట్

Published

on

By

BBMA పోలీస్ ఈ-న్యూస్ | వృద్ధురాలిని మోసం చేసి బంగారం అపహరించిన నిందితుడి అరెస్ట్

BBMA POLICE E:NEWS// వృద్ధురాలిని నమ్మించి మోసం చేసిన నిందితుడు అరెస్ట్

👉సహాయం చేస్తానని నమ్మించి బంగారం అపహరణ

👉₹25,000విలువైన గోల్డ్ మంగళసూత్ర పూసలు స్వాధీనం

#KamareddyTown పోలీసులు మెరుపు దర్యాప్తుతో 2రోజుల్లో అరెస్ట్

⚠️అపరిచితులను నమ్మవద్దు

📞అనుమానం ఉంటే వెంటనే 100కి కాల్ చేయండి

—జిల్లా ఎస్పి

Continue Reading

Police News

BBMA పోలీస్ ఈ-న్యూస్ | ముఖ్యమంత్రి పర్యటనకు ముందు భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్ల పరిశీలన

Published

on

By

BBMA పోలీస్ ఈ-న్యూస్ | ముఖ్యమంత్రి పర్యటనకు ముందు భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్ల పరిశీలన

గౌరవ #ముఖ్యమంత్రి భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా #కొడవటంచ ఆలయం నిర్మాణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో #హెలిప్యాడ్, #రోడ్డుఏర్పాట్లు, #సభా ప్రాంగణం, #పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. #భద్రత,ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేయడం జరిగింది.

Continue Reading

Trending