Connect with us

Police News

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

Published

on

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

 

●నేరస్తులకు శిక్ష పడేలా పక్కా ప్రణాళిక

 

●హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనర్

 

●నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ

 

కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు. నేరస్తులను కేవలం అరెస్టు చేయడమే కాకుండా.. వారికి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చూడటమే పోలీసుల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో అక్టోబరు నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు, అక్విటల్ అయిన పాత కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి.. ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరించారు.

 

చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్షిస్తూ.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, అవి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.

 

కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ప్రతి కేసుకు ఒక స్పష్టమైన ‘ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో డ్రగ్స్‌, రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అలాగే సైబర్ క్రైమ్, మహిళా భద్రత, స్ట్రీట్ క్రైమ్, ఆహార కల్తీ కేసులపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సూచించారు.

 

రౌడీ షీటర్లు, పాతనేరస్తులపై నిఘా పెంచాలని తమ పరిధిలో ఎలాంటి నేరాలను జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్.హెచ్.ఓలదే అని స్పష్టీకరించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై పి.డి.యాక్ట్ పెట్టాలని ఆదేశించారు.

 

సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించి దర్యాప్తు పూర్తి చేయాలని, తద్వారా శిక్షల శాతం (కన్విక్షన్‌ రేట్‌) పెంచేలా ప్రణాళికలు ఉండాలన్నారు. కఠిన శిక్షలు పడినప్పుడే నేరస్తుల్లో భయం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు సమాజములో పెరిగి పోతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తూ , వాటిని అదుపు చేసే విధంగా సాంకేతికతను పెంపోందించుకోవాలని, నిపుణుల సహాయముతో కేసులను దర్యాప్తు చేయాలని సూచించారు.

 

పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వెపన్ తమ వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. దీనికోసం ప్రతి 15 రోజులకోసారి వెపన్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు. ప్రతి అధికారి తమ పరిధి (జురిస్డిక్షన్‌)పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని, ఎస్‌హెచ్‌ఓలు కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

 

ఈ నెలవారి నేర సమీక్ష సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్ తోపాటు వివిధ విభాగాలు, జోన్ల డీసీపీలు శ్రీమతి కె.అపూర్వా రావు ఐపీఎస్, శ్రీమతి శ్వేత ఐపీఎస్, శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్, శ్రీమతి ఎస్ రష్మి పెరుమాళ్ ఐపీఎస్, శ్రీమతి కె.శిల్పావళి ఐపీఎస్, సి.రూపేశ్ ఐపీఎస్, శ్రీ.కె.కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్, శ్రీ.బి.బాలస్వామి ఐపీఎస్, శ్రీ.జి.చంద్రమోహన్, సిహెచ్.శ్రీనివాస్, శ్రీ.వి.అరవింద్ బాబు, శ్రీమతి పి.లావణ్య నాయక్ జాదవ్ తో పాటు అన్ని అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్ హెచ్ వోలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

BBMA POLICE E:NEWS ಚಿಕ್ಕಮಂಡ್ಯದಲ್ಲಿ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ರೈಡ್ ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟನೆ

Published

on

By

BBMA POLICE E:NEWS ಚಿಕ್ಕಮಂಡ್ಯದಲ್ಲಿ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ರೈಡ್ ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟನೆ

BBMA POLICE E:NEWS

ಈ ದಿನ ಬೂದನೂರು ಉತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಚಿಕ್ಕಮಂಡ್ಯದಲ್ಲಿ ಆಯೋಜಿಸಲಾಗಿದ್ದ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ರೈಡ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾನ್ಯ ಕೃಷಿ ಹಾಗೂ ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರಾದ ಶ್ರೀ ಎನ್ ಚಲುವರಾಯಸ್ವಾಮಿ ಅವರು ಉದ್ಘಾಟಿಸಿದರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾನ್ಯ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿಗಳು ಸೇರಿದಂತೆ ಹಲವು ಗಣ್ಯರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು.

ಕಾರ್ಯಕ್ರಮದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಸುರಕ್ಷತೆಯನ್ನು ಗಮನದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಅಗತ್ಯ ಭದ್ರತಾ ಕ್ರಮಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಜನಸಂದಣಿ ನಿಯಂತ್ರಣ ಮತ್ತು ಸಂಚಾರ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಸಮರ್ಪಕವಾಗಿ ನಿರ್ವಹಿಸಲು ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿಯನ್ನು ನಿಯೋಜಿಸಲಾಗಿತ್ತು. ಯಾವುದೇ ಅಹಿತಕರ ಘಟನೆಗಳು ನಡೆಯದಂತೆ ಮುನ್ನೆಚ್ಚರಿಕಾ ಕ್ರಮಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸುಗಮವಾಗಿ ನಡೆಸಲು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಸೂಕ್ತ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಮಾಡಿತ್ತು. ಸಾರ್ವಜನಿಕರ ಸಹಕಾರದಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಶಾಂತಿಯುತವಾಗಿ ಯಶಸ್ವಿಯಾಗಿ ನಡೆಯಿತು.

Continue Reading

Police News

BBMA POLICE E:NEWS ‘కూల్ లిప్’ నికోటిన్ ఉత్పత్తులపై కఠిన చర్యలకు ఆదేశాలు

Published

on

By

BBMA POLICE E:NEWS ‘కూల్ లిప్’ నికోటిన్ ఉత్పత్తులపై కఠిన చర్యలకు ఆదేశాలు

BBMA POLICE E:NEWS

యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న ‘కూల్ లిప్’ వంటి నికోటిన్ మాదక పదార్థాల వినియోగంపై జిల్లాలో కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రమాదకర ఉత్పత్తులు విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇలాంటి నిషేధిత పదార్థాల విక్రయంపై ప్రత్యేక దాడులు నిర్వహించి, సరఫరా గొలుసును గుర్తించి కట్టడి చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. యువత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తరహా మాదక పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

Continue Reading

Police News

BBMA POLICE E:NEWS పోలీస్ జాగిలం “రాఖీ”కి శిక్షణ పూర్తి సర్టిఫికెట్ అందజేత

Published

on

By

BBMA POLICE E:NEWS పోలీస్ జాగిలం “రాఖీ”కి శిక్షణ పూర్తి సర్టిఫికెట్ అందజేత

BBMA POLICE E:NEWS

నేరాల ఛేదనలో పోలీస్ జాగిలాల పాత్ర ఎంతో కీలకమైనది. పోలీస్ శాఖకు చెందిన “రాఖీ” అనే నూతన పోలీస్ జాగిలం IITA మొయినాబాద్‌లో ఎనిమిది నెలలపాటు ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఇటీవల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాగ్ హ్యాండ్లర్ రమేష్‌కు శిక్షణ పూర్తి చేసినందుకు సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.

రాఖీ వంటి శిక్షణ పొందిన జాగిలాలు నేరస్తులను గుర్తించడంలో, ఆధారాలను సేకరించడంలో మరియు ప్రమాదకర పరిస్థితుల్లో పోలీసులకు సహాయపడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తులో జిల్లాలో నేరాల నియంత్రణలో ఈ జాగిలం కీలకంగా పనిచేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీస్ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇలాంటి శిక్షణ పొందిన జాగిలాల సేవలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి.

Continue Reading

Trending