Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

BBMA POLICE E:NEWS// చిన్నారిని రక్షించిన యువకుడికి సీపీ సజ్జనర్ సన్మానం

Published

on

BBMA POLICE E:NEWS// చిన్నారిని రక్షించిన యువకుడికి సీపీ సజ్జనర్ సన్మానం

BBMA POLICE E:NEWS// చిన్నారిని రక్షించిన యువకుడికి సీపీ సజ్జనర్ సన్మానం

హైదరాబాద్‌లో అప్రమత్తతతో చిన్నారిని రక్షించిన మహ్మద్ ఫిరోజ్‌ను సిటీ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar సత్కరించారు. బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫిరోజ్‌కు శాలువా, ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. ఈ నెల 1న అబిడ్స్ ప్రాంతంలో స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న 8 ఏళ్ల బాలికను ఆటో డ్రైవర్ మాయమాటలతో తీసుకెళ్లి గోల్కొండలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఫిరోజ్ చిన్నారి ఏడుపు గమనించి అనుమానంతో ఆటోను అడ్డుకున్నారు. బాలిక చెప్పిన వివరాలతో నిందితుడు పారిపోగా, ఫిరోజ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు చేరుకుని చిన్నారిని సురక్షితంగా కుటుంబానికి అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. సమాజంలో బాధ్యతాయుతంగా స్పందించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని సీపీ పేర్కొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

ప్రేమ పేరుతో కుట్ర.. భర్త హత్య కేసు వెలుగులోకి

Published

on

గుజరాత్‌లో దారుణ ఘటన.. రెండో భర్త హత్య కేసులో మహిళతో పాటు పలువురి అరెస్టు

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం అయిన తర్వాత ఇద్దరు పిల్లల తల్లి అయిన జాగృతి అనే మహిళ పలు వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ చివరికి హత్య కేసులో చిక్కుకుంది.

వివరాల ప్రకారం, జాగృతి వివాహం సుఖదేవగిరితో జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం ఆమెకు భర్త సోదరుడు శాంతగిరితో అక్రమ సంబంధం ఏర్పడటంతో భర్తను వదిలేసి అతనితో వెళ్లిపోయింది.

తరువాత వేరే ప్రాంతంలో నివసిస్తూ పక్కింటి వ్యక్తి భరత్‌తో మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేయగా, కోపంతో ఆమె ప్రియుడితో కలిసి రెండో భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా మరికొంతమంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ హత్యకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. చివరికి కేసు మొత్తం బయటపడటంతో జాగృతి సహా సంబంధిత వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Continue Reading

News

బసంత్ నగర్ చెకపోస్ట్ ను సీపీ ఆకస్మిక తనిఖీ

Published

on

బక్రీద్ నేపథ్యంలో బసంత్ నగర్ టోల్ గేట్ చెక్‌పోస్ట్‌ను అర్ధరాత్రి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

బిబిఎంఏ న్యూస్ / బసంత్ నగర్ మే21

బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

 

ఈ నేపథ్యంలో అర్ధరాత్రి బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అంబర్ కిషోర్ ఝా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

పండుగల సమయంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.

Continue Reading

crime

వరంగల్ సబ్‌రిజిస్ట్రార్‌ పనిచేసిన దావులూరి ఆనంద్‌పై ఏసీబీ కేసు..

Published

on

 

* రూ.1.94 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

బిబిఎంఏ న్యూస్ / హనుమకొండ : మే 20 వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సబ్‌రిజిస్ట్రార్-2గా పనిచేసిన దావులూరి ఆనంద్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు తెలంగాణ ఏసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.

అధికారిక ఆదాయానికి మించి అవినీతి మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

సోదాల్లో రెండు ఇండ్లు, ఆరు ప్లాట్లు, రూ.24.50 లక్షల నగదు, బ్యాంక్ నిల్వలు, బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, గృహోపకరణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.1.94 కోట్లుగా అంచనా వేస్తుండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

అక్రమాస్తులపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.

Continue Reading

Trending