News
జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం
జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం
మంథని, ఏప్రిల్ 05 (బీబీఎంఏ న్యూస్):
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మంథని పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. హక్కుల కోసం పోరాటం ద్వారానే సాధించుకోవాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
అయితే జయంతి రోజున మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని అలంకరించకపోవడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహానీయుడికి అవమానమని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ⚠️
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు లింగయ్య, సుధాకర్, శ్రావణ్, రవికిరణ్ రిషి, ప్రణయ్ సమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.
News
ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్కు ఘన సన్మానం.. కందుల
రామగుండం | జూలై 11, 2026 తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా, అలాగే లక్ష్మీపురం గేట్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పోతన కాలనీ సింగరేణి కారిడార్ రోడ్డు వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ను స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, కొక్కిరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సాలువాతో ఘనంగా సత్కరించి, ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురం ప్రాంత ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కందుల సతీష్, వేణుగోపాలరావు, మహమ్మద్ గౌస్, ఇరుకుల సంతోష్, కె. అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు.
News
SIR కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించిన కార్పొరేటర్ స్వరూప సతీష్
గోదావరిఖని: 21వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతంలోని బూత్ నంబర్-230 పరిధిలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలకు SIR కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.
ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్ఓలకు పూర్తి వివరాలు అందించి తమ ఓటును మ్యాపింగ్లో భద్రపరచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాస్, కొలిపాక కనకరాజు, స్థానిక మహిళలు మరియు ఇతరులు పాల్గొని SIR కార్యక్రమానికి సహకారం అందించారు.
News
వెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
జగిత్యాల,జూలై 11: వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన గంగుల సనత్ కుమార్ (38)కు జగిత్యాల 1వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించింది. 2024 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై అప్పటి ఎస్ఐ ఉమాసాగర్ కేసు నమోదు చేయగా, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి పటిష్టమైన ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది బిట్ల నర్సయ్య సమర్థవంతంగా వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీమతి జి. సునీత రవీంద్ర రెడ్డి నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ మాట్లాడుతూ మహిళలు, యువతులు తమపై జరిగే వేధింపులు, లైంగిక దాడులు లేదా ఇతర అన్యాయాల విషయంలో భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా పోలీసు శాఖ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఈ కేసులో సమర్థంగా పనిచేసిన పీపీ బిట్ల నర్సయ్య, దర్యాప్తు అధికారి రామ్ నరసింహారెడ్డి, అప్పటి ఎస్ఐ ఉమాసాగర్, కోర్టు సిబ్బంది తదితరులను ఎస్పీ అభినందించారు.
-
crime5 days agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
Telangana4 hours agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News4 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News1 week agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News4 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News4 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News1 week agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana4 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టివేత
