Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఏసీపీ మడత రమేష్

Published

on

మంథని, బిబిఎంఏ న్యూస్, జూలై 11: విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఏసీపీ మడత రమేష్ సూచించారు. మంథని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

క్రమశిక్షణతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులపై నిరాధార ఆరోపణలు చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. పిల్లల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు విశ్వాసం ఉంచి వారితో నిరంతరం సమన్వయం కలిగి ఉండాలని కోరారు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరగడంతో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంటి వద్ద పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, రోజువారీ అలవాట్లపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులను చెడు అలవాట్లకు దూరంగా ఉంచి, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేలా ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంథని సీఐ బద్దె స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, వైస్ ప్రిన్సిపల్ నవీన్, జూనియర్ ప్రిన్సిపల్ రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు సాంబయ్య, రమేష్ పున్నం, శ్రీనివాస్, రవీందర్, పీటీ రమేష్, అనిత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదిలాబాద్ రణ దివ్య నగర్ లో కాటన్ సెర్చ్

Published

on

ఆదిలాబాద్ జిల్లా రణ దివ్యానగర్‌లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 150 మంది పోలీసులతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 128 వాహనాలను తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్‌లు లేని 16 వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే అక్రమంగా తరలిస్తున్న 10 మద్యం క్వార్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థంగా అరికట్టగలమని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Continue Reading

crime

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్

Published

on

సిద్దిపేట, బీబీఎంఏ న్యూస్, జూలై 6:

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కోర్రా దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. నాగపురి గ్రామానికి చెందిన 11 నాలా (NALA) భూ మార్పిడి దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అనుకూలంగా చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా, సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

 

నిందితుడి వద్ద నుంచి రూ.70 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు తెలిపింది.

Continue Reading

Police News

POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ

Published

on

By

POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ

POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ

ଓଡ଼ିଶା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//

ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ଗ୍ରାମୀଣ ଥାନା ପୋଲିସ ଏକ ବଡ଼ ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟକୁ ଠାବ କରିଛି। ଝାଡ଼ଖଣ୍ଡକୁ ଚୋରାଚାଲାନ ହେଉଥିବା ୧୩୧.୩୪୦ କିଲୋଗ୍ରାମ ଗଞ୍ଜେଇ ଜବତ କରାଯାଇଛି। ଅଭିଯାନ ସମୟରେ ଗଞ୍ଜେଇ ପରିବହନରେ ବ୍ୟବହୃତ ଏକ କାର, ତିନୋଟି ନମ୍ବର ପ୍ଲେଟ୍ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ଆପତ୍ତିଜନକ ସାମଗ୍ରୀ ମଧ୍ୟ ଜବତ ହୋଇଛି। ଏହି ଘଟଣାରେ ଦୁଇଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରାଯାଇ PS କେସ୍ ନଂ 135/26 ଅନୁଯାୟୀ ଅଦାଲତକୁ ପଠାଯାଇଛି। ନିଶାଦ୍ରବ୍ୟ ବିରୋଧୀ ଅଭିଯାନ ଜାରି ରହିବ ବୋଲି ପୋଲିସ ସୂଚନା ଦେଇଛି।

Continue Reading

Trending