Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి చిట్యాల ఎస్ఐ సతీష్

Published

on

పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి చిట్యాల ఎస్ఐ సతీష్

బిబిఎంఏ న్యూస్ /చిట్యాల జయశంకర్ భూపాలపల్లి మార్చి 15:

చిట్యాల పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ సూచించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పిల్లలు ఈత కోసం చెరువులు, కుంటలు వంటి నీటి వనరుల వద్దకు వెళ్లే అవకాశం ఉందని, ఈ సందర్భంలో తల్లిదండ్రులు పిల్లల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

అదేవిధంగా మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పిల్లల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయడంతో పాటు వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని ఎస్ఐ సతీష్ విజ్ఞప్తి చేశారు. పిల్లలు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్‌ మోటపలుకుల వెంకట్ పై కేసు

Published

on

కోరుట్లలో కార్ కన్సల్టెన్సీకి మోసం… రూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్‌ మోటపలుకుల వెంకట్ పై కేస నమోదు

బిబిఎంఏ న్యూస్ / కోరుట్ల : ఏప్రిల్ 2:

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ యాజమాన్యాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెల్గటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన మోటపలుకుల వెంకట్ అనే వ్యక్తి రిపోర్టర్‌గా చలామణి అవుతూ జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ వద్ద రెండు కార్లు తీసుకున్నట్లు సమాచారం.

మొదటగా తీసుకున్న హ్యుందాయ్ క్రెటా కారుకు సంబంధించి రూ.2.5 లక్షలు, అనంతరం తీసుకున్న గ్రాండ్ ఐ-10 కారుకు రూ.2.15 లక్షలు చెల్లించాల్సి ఉండగా మొత్తం రూ.4.65 లక్షలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు కన్సల్టెన్సీ యాజమాన్యం తెలిపింది.

డబ్బులు అడగడానికి వెళ్లిన జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ యజమానులు చెక్కపల్లి నవీన్, కుర్ర ఆంజనేయులను తాను రిపోర్టర్‌నని, డబ్బులు అడిగితే మీ సంగతి చూస్తానని మోటపలుకుల వెంకట్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ మేరకు చెక్కపల్లి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోటపలుకుల వెంకట్‌పై ఛీటింగ్, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Continue Reading

Telangana

బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శనతో విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన

Published

on

బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శనతో విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన

 

మంథని, (బిబిఎంఏ న్యూస్) మార్చి 28:

జడ్పీహెచ్ఎస్ ఏక్లాస్పూర్ పాఠశాల విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బసంత్ నగర్‌లోని కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో సిమెంట్ తయారీకి ఉపయోగించే ఐరన్, జిప్సం వంటి రా మెటీరియల్స్ క్రషింగ్ విధానం, బొగ్గుతో హీటింగ్ ప్రక్రియ, తుది సిమెంట్ తయారీ దశలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగుల నింపడం, గూడ్స్ రైళ్లలో లోడింగ్ చేసే ఆటోమేటిక్ విధానాన్ని కూడా అవగాహన చేసుకున్నారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు సిమెంట్ తయారీపై ప్రాయోగిక జ్ఞానం సంపాదించారు. హెడ్ మాస్టర్ జి. జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంతోష్, డాక్టర్. దొమ్మటి రవి, సుచిత్ర రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, మంజుల, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

End

Continue Reading

Telangana

భద్రాచలం వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు..

Published

on

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

బీబీఎంఏ న్యూస్ / భద్రాచలం / మార్చి 28:

శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేదికగా మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలం పట్టణం అంతా రామనామ స్మరణతో మార్మోగింది.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Continue Reading

Trending