Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Andhra

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం.. సీపీ చొరవతో వ్యక్తి ప్రాణాలు రక్షణ

Published

on

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం.. సీపీ చొరవతో వ్యక్తి ప్రాణాలు రక్షణ

బిబిఎం ఏ న్యూస్ / విశాఖపట్నం

విశాఖపట్నంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నగర పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ప్రజలకు అందుబాటులో ఉంచిన 7995095799 నంబర్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి, విశాఖ రైల్వే స్టేషన్ 8వ ప్లాట్‌ఫాం సమీపంలో ఓ వ్యక్తి ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన సీపీ రైల్వే పోలీసులను అప్రమత్తం చేయగా, వారు ఘటనాస్థలికి చేరుకొని ట్రాక్‌పై ఉన్న వ్యక్తిని క్షణాల్లో రక్షించారు. అనంతరం బాధితుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఫోన్ చేసిన వెంటనే స్పందించి తమ కుటుంబ సభ్యుడి ప్రాణాలు కాపాడినందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గారికి బాధితుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నగర పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే మామిడి పంట.. ఆవేదనలో ఏపీ రైతులు

Published

on

అమరావతి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏడాది పొడవునా శ్రమించి, భారీ పెట్టుబడులు పెట్టి పండించిన మామిడి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరలు మరింత పతనమవడంతో కొందరు రైతులు తమ పంటను రోడ్డు పక్కనే పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంగినపల్లి, తోతాపురి వంటి మామిడి రకాలకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా భర్తీ చేయలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంటున్నారు.

 

వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎరువులు, పురుగుమందులు, కార్మిక వ్యయాలు, రవాణా ఖర్చులు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.

 

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

 

Continue Reading

Andhra

తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన

Published

on

తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

 

చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

 

ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Continue Reading

Andhra

23 నెలల చిన్నారికి నోబుల్ వరల్డ్ రికార్డు.. కాకినాడకు గర్వకారణమైన ఆమైరా ఖాదరి నవాజ్

Published

on

అసాధారణ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి.. కలెక్టర్ హరి చందన్ ప్రత్యేక అభినందనలు

కాకినాడ, BBMA NEWS, జూన్ 11:

కాకినాడకు చెందిన 23 నెలల చిన్నారి షేక్ ఆమైరా ఖాదరి నవాజ్ తన అసాధారణ ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది. రామకృష్ణారావుపేటకు చెందిన ఎండీ బాషా మనవరాలు, షేక్ ఖజా మొహిద్దిన్ – మహమ్మద్ బషీర్ దంపతుల కుమార్తె అయిన ఆమైరా చిన్న వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి ఈ ఘనత సాధించింది.

 

పండ్లు, కూరగాయలు, ఇంగ్లీష్ అక్షరాలు, ఫోనిక్ పదాలు, సంఖ్యలు, శరీర భాగాలు, ఆకారాలు, పక్షులు, వ్యతిరేక పదాలు, గృహోపకరణాలు గుర్తించి చెప్పడమే కాకుండా వివిధ రైమ్స్‌ను సైతం చక్కగా చెప్పగలగడం ఆమె ప్రత్యేకత. చిన్నారి ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ హరి చందన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తన చాంబర్‌కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లను పరిశీలించిన కలెక్టర్, ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని కొనియాడారు.

 

ఆమైరాను “వన్ ఇన్ ఎ మిలియన్”గా గుర్తిస్తూ పురస్కార పత్రాలను అందజేయడం విశేషమని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అలీమ్ తెలిపారు. చిన్నారి తండ్రి షేక్ ఖజా మొహిద్దిన్ చెన్నైలో వైర్లెస్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, తల్లి మహమ్మద్ బషీర్ ఎం.ఫార్మసీ పూర్తి చేసి గృహిణిగా ఉన్నారు. ఆమైరా సాధించిన ఘనతపై కాకినాడ వాసులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ చిన్నారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

Continue Reading

Trending