crime
1.4 కిలోల గంజాయి, ఆరుగురు నిందితుల అరెస్ట్ వన్ టౌన్ పోలీసులు.
గంజాయి అక్రమ రవాణాపై వన్ టౌన్ పోలీసుల విజయం
1.4 కిలోల గంజాయి, ఆరుగురు నిందితుల అరెస్ట్
బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయి రవాణాను అడ్డుకోవడంలో పోలీసులు మరోసారి చాకచక్యంగా వ్యవహరించారు. కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న చిక్కుడు రాహుల్ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 900 గ్రాముల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను సరఫరా చేసిన మరికొందరి వివరాలను వెల్లడించడంతో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలోని బృందం నిందితులైన కొప్పుల సాయి ధనుష్, చిలుక వినీత్, మంచి కట్ల అక్షయ్, మాటూరి సాత్విక్, భుఖ్య రాజేష్లను పట్టుకుని వారి వద్ద నుంచి మరో 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసింది. ఈ కేసులో మొత్తం 1.4 కిలోల గంజాయి, ఆరు మొబైల్ ఫోన్లు జప్తు చేయబడినట్టు సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ తెలిపారు.
అక్రమ వ్యాపారంలోకి ఎలా జారిపోయారు?
కూలి పనులతో వచ్చిన డబ్బులు సరిపోక, సులభంగా డబ్బు సంపాదించాలని రాహుల్ అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. మహారాష్ట్ర బల్లార్షా ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి గోదావరిఖని, పరిసర ప్రాంతాల్లో అమ్మడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పరిచయం అయిన మరో ఐదుగురు కూడా అలవాటుతో పాటు లాభం కోసం రాహుల్తో కలిసి రవాణాలో పాల్గొంటున్నట్టు వెల్లడైంది.
తక్కువ ధరకు కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి స్థానికంగా అమ్మితే మంచి లాభం వస్తుందని భావించి ఈ గుంపు పనిచేస్తోంది. గంజాయి డిమాండ్ను అవకాశం చేసుకుని అక్రమ రవాణా కొనసాగిస్తున్న వీరిని వన్ టౌన్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయగలిగారు.
సిబ్బందికి అభినందనలు
ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, శ్రీనివాస్, సదానందం, కానిస్టేబుల్స్ ప్రకాష్, రమేష్, మధుకర్, మధుసూదన్లను సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ అభినందించారు. నిందితుల పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్టు తెలిపారు.
గోదావరిఖని పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల కఠినమైన చర్యలు కొనసాగుతున్నాయి.
crime
వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
BBMA NEWS:
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
crime
లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్.. గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం
బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, రెండు డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో 20 మోటార్సైకిళ్లు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ACB
ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై అక్రమాస్తుల కేసు నమోదు
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్అండ్బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు.
మోహన్ నాయక్ కార్యాలయం, నివాసం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, కొంపల్లి, గచ్చిబౌలిలో ఏడు ఫ్లాట్లు, మియాపూర్లో ట్రిప్లెక్స్ విల్లా, కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, నిజామాబాద్లో విల్లా కొనుగోలుకు చెల్లించిన అడ్వాన్స్ సహా పలు ఆస్తులు గుర్తించారు.
అదనంగా రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17.94 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోహన్ నాయక్ను అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
-
News4 weeks agoఉపసర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News4 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News3 days agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టివేత
-
News4 weeks agoనేడు మృగశిర కార్తె ప్రారంభం.. రైతన్నకు ఆశల పండుగ
