Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

*ఆంధ్ర ప్రదేశ్ – బిల్డింగ్ క్రమబద్ధీకరణ BPS స్కీమ్ జీవో విడుదల*

Published

on

*ఆంధ్ర ప్రదేశ్ - బిల్డింగ్ క్రమబద్ధీకరణ BPS స్కీమ్ జీవో విడుదల*

*మున్సిపాలిటీలలో బిల్డింగ్ క్రమబద్ధీకరణ BPS స్కీమ్ జీవో విడుదల*

 

*అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్ / ప్లాన్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ – ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం (BPS – 2025)*

 

*ఎవరు అప్లై చేయొచ్చు?*

 

👉01-01-1985 నుండి 31-08-2025 మధ్య కట్టిన బిల్డింగ్స్.

👉మున్సిపాలిటీ, కార్పొరేషన్, UDA, CRDA, VMRDA, IALA పరిధిలో ఉన్నవీ.

 

*ఎవరు అప్లై చేయలేరు?*

 

👉ప్రభుత్వ భూములు / ఎండోవ్మెంట్స్ / సాగర్ / నది / వాగు / ట్యాంక్ బెడ్

👉మాస్టర్ ప్లాన్‌లో రోడ్ / ఓపెన్ స్పేస్ / పార్క్‌కు వినియోగించే ల్యాండ్లు

👉31-08-2025 తర్వాత కట్టిన నిర్మాణాలు.

👉ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నవి.

 

*ఎలా అప్లై చేయాలి?*

 

వెబ్సైట్ www.bps.ap.gov.in

అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్:

✔ రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీ

✔ EC & Market Value Certificate

✔ ప్లాన్ (ఉంటే)

✔ బిల్డింగ్ ఫోటోలు

✔ Structural Stability Certificate (Structural Engineer నుండి)

✔ Indemnity Bond (Annexure-IV)

 

*ఫీజులు / చార్జీలు*

 

👉ప్లాట్ సైజ్ + డివియేషన్ % + ల్యాండ్ విలువ ఆధారంగా చార్జీలు.

👉అప్లై సమయంలో ₹10,000 ముందస్తు చెల్లింపు తప్పనిసరి.

 

*పాత బిల్డింగ్స్‌కు డిస్కౌంట్:*

✅ 31-12-1997 లోపల ఉన్నవైతే 25% తగ్గింపు

✅ స్లమ్ ప్రాంతాలు – 50% తగ్గింపు.

 

*అప్లై చేయడానికి గడువు*

 

నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 120 రోజులు మాత్రమే. ఇది తుది అవకాశమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇట్లు ప్రణాళికా కార్యదర్శి 94418 14967

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి

Published

on

కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ

Published

on

జూలై 5న హైదరాబాద్‌లో ‘అనిత ఓ అనిత’ 20 ఏళ్ల వేడుకల

భూపాలపల్లి, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ప్రముఖ సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపతి రాము, డప్పు సత్తి, బండి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ‘అనిత ఓ అనిత’ పాట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రేమికులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఈ ఫోక్ గీతం తెలుగు ఫోక్ సంగీతంలో ప్రేమ పాటలకు కొత్త దారిని చూపిందన్నారు. విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాట రచయితలు, గాయకులు, గాయని అనిత నాగరాజ్‌తో కలిసి జూలై 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు, గాయకులు, సంగీతాభిమానులు, ఫోక్ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Continue Reading

Telangana

ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Published

on

మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

Trending