Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

BBMA POLICE E:NEWS// శాంతి–సౌహార్దంతో పండుగలు జరుపుకుందాం: మహబూబ్‌నగర్ పోలీస్ పిలుపు

Published

on

BBMA POLICE E:NEWS// శాంతి–సౌహార్దంతో పండుగలు జరుపుకుందాం: మహబూబ్‌నగర్ పోలీస్ పిలుపు

BBMA POLICE E:NEWS// శాంతి–సౌహార్దంతో పండుగలు జరుపుకుందాం: మహబూబ్‌నగర్ పోలీస్ పిలుపు

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ శ్రీమతి డి. జనకి, IPS ఆధ్వర్యంలో ఘనంగా పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ, ముస్లిం తదితర మతాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి, సామరస్యాన్ని కాపాడటం అందరి బాధ్యత అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలు ప్రశాంతంగా ముగిసినందుకు ఎస్పీ అభినందనలు తెలిపారు. రాబోయే హనుమాన్ జయంతి, బక్రీద్ వంటి పండుగలను కూడా పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. ఊరేగింపులు, కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, శబ్ద కాలుష్య నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని, అల్లర్లు సృష్టిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతల కోసం పోలీసులకు సహకరించాలని కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మంచిర్యాలలో భారీ సెర్చ్ ఆపరేషన్.. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు

Published

on

రూ.20 వేల అక్రమ మద్యం, 166 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, తల్వార్ స్వాధీనం – మత్తు పదార్థాలు, నేరాల నిర్మూలనే లక్ష్యం: సీపీ అంబర్ కిషోర్ ఝా

బీబీఎంఏ న్యూస్, మంచిర్యాల, జూలై 12:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది ఎన్టీఆర్ నగర్‌లో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రూ.20 వేల విలువైన అక్రమ మద్యం, పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన 10 మంది యువకులు, అలాగే 10 మంది పాత నేరస్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

 

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తున్నామని, పోలీసులకు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే యువతకు మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు.

 

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావుతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌కు ఘన సన్మానం.. కందుల

Published

on

రామగుండం | జూలై 11, 2026 తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా, అలాగే లక్ష్మీపురం గేట్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పోతన కాలనీ సింగరేణి కారిడార్ రోడ్డు వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, కొక్కిరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సాలువాతో ఘనంగా సత్కరించి, ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురం ప్రాంత ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కందుల సతీష్, వేణుగోపాలరావు, మహమ్మద్ గౌస్, ఇరుకుల సంతోష్, కె. అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

SIR కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించిన కార్పొరేటర్ స్వరూప సతీష్

Published

on

గోదావరిఖని: 21వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతంలోని బూత్ నంబర్-230 పరిధిలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలకు SIR కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.

ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్‌ఓలకు పూర్తి వివరాలు అందించి తమ ఓటును మ్యాపింగ్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాస్, కొలిపాక కనకరాజు, స్థానిక మహిళలు మరియు ఇతరులు పాల్గొని SIR కార్యక్రమానికి సహకారం అందించారు.

Continue Reading

Trending