Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

crime

ll ఉద్యోగాల పేరిట నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన మహిళ అరెస్టు ll 

Published

on

ll ఉద్యోగాల పేరిట నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన మహిళ అరెస్టు ll 

శ్రీకాకుళం జిల్లా పోలీసులు

 

ll ఉద్యోగాల పేరిట నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన మహిళ అరెస్టు ll

 

శ్రీకాకుళం, నవంబర్ 21.

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి భారీగా డబ్బులు తీసుకొని నకిలీ అపాయింట్మెంట్, జాయినింగ్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన కేసులో పాతపట్నం పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు.

 

ఒడిశా రాష్ట్రం గుమ్మ బ్లాకులోని జొల్ల గ్రామానికి చెందిన గంట ప్రదీప్కు చెందిన ముగ్గురు వ్యక్తులకు ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి, ఒడిశా రాష్ట్రం ఉప్పలాడ గ్రామానికి చెందిన గుంపు మణి అనే మహిళ (ప్రస్తుతం పాతపట్నం, సహారా వీధి నివాసి) వారి నుండి మొత్తం ₹4,50,000/- రూపాయలు తీసుకుంది. అనంతరం వారికి నకిలీ జాయినింగ్ లెటర్లు ఇచ్చి మోసం చేశాను.

ఈ విషయంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతపట్నం పోలీసు స్టేషన్‌లో క్రైమ్ నం. 71/2025, U/S 318(4), 338 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తు పోలీసు అధికారి పాతపట్నం ఎస్సై శ్రీ కె. మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిందితురాలు గుంపు మణిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

 

“ఉద్యోగాలు పేరుతో మోసాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ప్రజలు ఇటువంటి మోసపూరిత మాటలకు లోనుకావద్దు అని ఎస్సై తెలిపారు.

@APPOLICE100

#jobfroud

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

వరంగల్ సబ్‌రిజిస్ట్రార్‌ పనిచేసిన దావులూరి ఆనంద్‌పై ఏసీబీ కేసు..

Published

on

 

* రూ.1.94 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

బిబిఎంఏ న్యూస్ / హనుమకొండ : మే 20 వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సబ్‌రిజిస్ట్రార్-2గా పనిచేసిన దావులూరి ఆనంద్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు తెలంగాణ ఏసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.

అధికారిక ఆదాయానికి మించి అవినీతి మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

సోదాల్లో రెండు ఇండ్లు, ఆరు ప్లాట్లు, రూ.24.50 లక్షల నగదు, బ్యాంక్ నిల్వలు, బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, గృహోపకరణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.1.94 కోట్లుగా అంచనా వేస్తుండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

అక్రమాస్తులపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.

Continue Reading

crime

ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : డీసీపీ భాస్కర్

Published

on

మంచిర్యాల, మే 14 (బిబిఎంఏ న్యూస్): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లె గ్రామంలో గురువారం ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులపై పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇళ్ల యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, కుటుంబ సభ్యుల సమాచారం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వారు చట్టబద్ధంగా జీవనం సాగించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

గ్రామాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. “ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లే వారు ఇంట్లోని బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అనంతరం సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆరు ప్రకాష్, రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, ఎస్సై శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

crime

చర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..

Published

on

ప్రమాదమా? హత్యా? దర్యాప్తు కొనసాగింపు

బిబిఎంఏ న్యూస్ /

ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో నడిరోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఎర్రవెల్లి పార్శారం‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై మొదట హత్య అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలానికి సమీపంలో నిలిపివున్న కారువద్ద పోలీస్ డాగ్ ఆగడంతో కేసుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ సందర్భంగా జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ప్రారంభంలో హత్య కోణంలో దర్యాప్తు చేపట్టామని, అయితే ప్రాథమిక విచారణలో ఇది రోడ్డు ప్రమాదంగా భావిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Continue Reading

Trending