crime
ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం!
ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం!
కృత్రిమ మేధ (AI) విస్తృతి పెరిగాక.. చిన్న స్టార్టప్ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా ఇప్పుడు ‘ఏఐ చాట్బోట్’ల జపం చేస్తున్నాయి. కస్టమర్ల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉండటంతో సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతికత వెనుక ఓ సరికొత్త ముప్పు పొంచి ఉంది. అదే ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ (Prompt Injection).
అసలేంటీ ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’?
సాధారణంగా ఏఐ పని చేయడానికి మనం ఇచ్చే ఆదేశాలను ‘ప్రాంప్ట్’ అంటారు. సైబర్ నేరగాళ్లు ఈ ప్రాంప్ట్లనే ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఏఐ మోడల్ను తప్పుదోవ పట్టించేలా, ట్రిక్ చేసేలా ‘మలీషియస్ ప్రాంప్ట్స్’ (కీడు చేసే ఆదేశాలు) ఇస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. “ఏఐని మాటలతో మాయ చేయడం”. ఇలా ఏఐని కన్ఫ్యూజ్ చేసి, సాధారణంగా బయటపెట్టకూడని సంస్థల అంతర్గత పత్రాలు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబట్టడమే ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్’.
డేటా భద్రతకు పెను సవాల్
ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఏఐ మోడల్స్, చాట్బోట్లను సంస్థలోని కీలకమైన డేటా సిస్టమ్లకు (CRM డేటా, హెల్ప్డెస్క్ టికెట్లు, ఉద్యోగుల సమాచారం, ఫైనాన్షియల్ రికార్డులు) అనుసంధానిస్తున్నాయి. ఎండ్ యూజర్కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు. కానీ, హ్యాకర్లు వేసే ఒకే ఒక్క ‘ట్రిక్కీ ప్రాంప్ట్’ వల్ల ఈ గోప్య సమాచారమంతా బయటపడే ప్రమాదం ఉంది.
‘గార్డ్రెయిల్స్’తోనే రక్షణ
ఈ ముప్పును పసిగట్టి, నివారించడానికి సంస్థలు తక్షణమే ‘ప్రాంప్ట్ గార్డ్రెయిల్స్’ (రక్షణ కవచాలు) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక అంచె భద్రత సరిపోదు, మల్టీ-లేయర్ డిఫెన్స్ విధానాన్ని పాటించాలి.
జాగ్రత్తలివే..!
• మోడల్-లెవల్ సెక్యూరిటీ: ఏఐకి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం, కఠినమైన నిబంధనలు (Hard Guardrails) విధించడం ద్వారా అనవసర సమాచారాన్ని ఇవ్వకుండా నియంత్రించాలి.
• ప్రాంప్ట్-లెవల్ సెక్యూరిటీ: హానికరమైన (Malicious) ప్రాంప్ట్లను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
• సిస్టమ్-లెవల్ సెక్యూరిటీ: ఏఐకి యాక్సెస్ ఇచ్చే డేటా, ఏపీఐ (API)లపై కఠిన నియంత్రణలు ఉండాలి.
• ఆడిట్స్ & యాక్సెస్: ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్స్ నిర్వహిస్తూ.. డేటా యాక్సెస్ను పరిమితం చేయాలి.
సరైన భద్రతా చర్యలు తీసుకోకపోతే సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోవడంతో పాటు, విలువైన డేటా నేరగాళ్ల చేతికి చిక్కి కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది.
crime
వరంగల్ సబ్రిజిస్ట్రార్ పనిచేసిన దావులూరి ఆనంద్పై ఏసీబీ కేసు..
* రూ.1.94 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
బిబిఎంఏ న్యూస్ / హనుమకొండ : మే 20 వరంగల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సబ్రిజిస్ట్రార్-2గా పనిచేసిన దావులూరి ఆనంద్పై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు తెలంగాణ ఏసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు.
అధికారిక ఆదాయానికి మించి అవినీతి మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో రెండు ఇండ్లు, ఆరు ప్లాట్లు, రూ.24.50 లక్షల నగదు, బ్యాంక్ నిల్వలు, బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, గృహోపకరణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.1.94 కోట్లుగా అంచనా వేస్తుండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.
అక్రమాస్తులపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.
crime
ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : డీసీపీ భాస్కర్
మంచిర్యాల, మే 14 (బిబిఎంఏ న్యూస్): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లె గ్రామంలో గురువారం ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులపై పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇళ్ల యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, కుటుంబ సభ్యుల సమాచారం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వారు చట్టబద్ధంగా జీవనం సాగించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
గ్రామాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. “ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లే వారు ఇంట్లోని బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అనంతరం సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆరు ప్రకాష్, రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, ఎస్సై శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
crime
చర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
ప్రమాదమా? హత్యా? దర్యాప్తు కొనసాగింపు
బిబిఎంఏ న్యూస్ /
ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో నడిరోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఎర్రవెల్లి పార్శారంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై మొదట హత్య అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలానికి సమీపంలో నిలిపివున్న కారువద్ద పోలీస్ డాగ్ ఆగడంతో కేసుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ సందర్భంగా జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ప్రారంభంలో హత్య కోణంలో దర్యాప్తు చేపట్టామని, అయితే ప్రాథమిక విచారణలో ఇది రోడ్డు ప్రమాదంగా భావిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
-
crime1 week agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News6 days agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
News4 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News4 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
Entertainment2 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime1 week agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime7 days agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
