Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

నర్సుల వేతనాల పెంపుకు గళమెత్తిన తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్

Published

on

హైదరాబాద్, జూలై 16 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్‌లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు నెలకు కనీస వేతనం రూ.40 వేలుగా నిర్ణయించాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నోముల సూర్యనారాయణ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో నర్సులకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు మాత్రమే వేతనం చెల్లిస్తూ, రోజుకు 10–12 గంటలు పనిచేయిస్తున్నప్పటికీ ఓవర్‌టైమ్, వారాంతపు సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ ప్రయోజనాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్రాలకు పంపిన నిపుణుల కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే నర్సులకు గౌరవప్రదమైన వేతనం, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

విదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం

Published

on

హైదరాబాద్, జూలై 17 : ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశీ జీవితం అంటూ కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు పెరుగుతున్న ఈ రోజుల్లో, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను ఆచరణలో చూపిస్తూ హైదరాబాద్‌కు చెందిన యువకుడు నల్లగొండ నిఖిల్ నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. హైదరాబాద్ మైదిపట్నం వాస్తవ్యులు నల్లగొండ సురేష్–మీనా దంపతుల కుమారుడైన నిఖిల్ ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. బిజీ ఉద్యోగ జీవితంలోనూ తన తల్లిదండ్రుల కోరికలను గుర్తుంచుకుని, ప్రత్యేకంగా భారత్‌కు వచ్చి వారిని మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించడం విశేషం. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి నిఖిల్ ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశాడు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో కుటుంబ సభ్యులు కలిసి గడిపిన సమయం వారికి చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చింది. ప్రస్తుతం చాలామంది యువత విదేశాల్లో స్థిరపడిన తర్వాత ఉద్యోగ బాధ్యతలతో స్వదేశానికి రావడమే అరుదుగా మారిన తరుణంలో నిఖిల్ మాత్రం తల్లిదండ్రులను మొదటి ప్రాధాన్యంగా భావించి వారి మనసులోని కోరికను నెరవేర్చడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, కృతజ్ఞత, సేవాభావం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనే సందేశాన్ని ఆయన తన చర్య ద్వారా సమాజానికి అందించాడు. నిఖిల్ చేసిన ఈ మంచి పనిని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు ఆయనను అభినందిస్తూ ప్రతి యువకుడు తల్లిదండ్రుల పట్ల ఇలాంటి బాధ్యతతో వ్యవహరిస్తే కుటుంబ విలువలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి, కుటుంబ బంధాలు, పెద్దల పట్ల గౌరవాన్ని మరువకుండా ఆచరిస్తున్న నిఖిల్ నిజంగా నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచారని కొనియాడుతున్నారు. తల్లిదండ్రుల సంతోషమే తనకు గొప్ప ఆనందమని భావించి వారిని పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనానికి తీసుకెళ్లిన నల్లగొండ నిఖిల్ చర్య కుటుంబ బంధాల గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది.

Continue Reading

crime

రూ.60 వేల లంచం కేసులో ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ, ఏఈ ఏసీబీ వలలో

Published

on

ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం నిర్వహించిన ట్రాప్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ (AO-1), అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ (AO-2) లంచం కేసులో పట్టుబడ్డారు.

సోనాల్ గ్రామంలో వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.60 వేల లంచం డిమాండ్ చేసి, ఏఈ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ వద్ద నుంచి రూ.60 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అధికారులను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజాసేవకులు లంచం కోరితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Continue Reading

News

ఎస్‌వీ జూలాజికల్ పార్క్‌ను సందర్శించిన అసెంబ్లీ వన్యప్రాణి–పర్యావరణ పరిరక్షణ కమిటి 

Published

on

 చంద్రగిరి అసెంబ్లీ వన్యప్రాణి,పర్యావరణ పరిరక్షణ కమిటీ ఎస్‌వీ జూలాజికల్ పార్క్‌ను సందర్శించింది. కమిటీ చైర్మన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సభ్యులు జి. శంకర్రావు, వి. నరేంద్ర వర్మ రాజుతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అటవీ శాఖ అధికారులు కమిటీ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జూ పార్క్‌లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, 3,100 ఎకరాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతిపెద్ద జూలాజికల్ పార్క్ చంద్రగిరి నియోజకవర్గంలో ఉండడం అదృష్టకరమని పేర్కొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు జూ పార్క్‌ను పరిశీలించి సందర్శకులకు అందుతున్న సౌకర్యాలు, జంతువులకు అందిస్తున్న ఆహారం, సంరక్షణ ఏర్పాట్లపై ఆరా తీశారు. బ్యాటరీ వాహనాలు, సైకిళ్లు, తాగునీటి సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

 

జూకు సందర్శకులు తక్కువగా రావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.18 కోట్ల ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ వెల్లడించింది. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కల్పించి జూను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

Trending