Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ముత్తారం మండలంలో  విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

Published

on

మోటార్ నిర్వహణ సమయంలో ప్రమాదం.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ముత్తారం, బీబీఎంఏ న్యూస్, జూలై 7: ముత్తారం మండలంలోని పారుపల్లి సమీపంలో మంగళవారం జరిగిన విషాద ఘటనలో రైతు మారం వెంకట్ రెడ్డి (45) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, ఉదయం తన వ్యవసాయ భూమికి వెళ్లిన వెంకట్ రెడ్డి మోటార్ నిర్వహణ కోసం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని భావించి కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న వెంకట్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, విద్యుత్ పరికరాల వద్ద పనిచేసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ శాఖ భద్రతపై మరింత అవగాహన కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్

Published

on

సిద్దిపేట, బీబీఎంఏ న్యూస్, జూలై 6:

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కోర్రా దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. నాగపురి గ్రామానికి చెందిన 11 నాలా (NALA) భూ మార్పిడి దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అనుకూలంగా చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా, సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

 

నిందితుడి వద్ద నుంచి రూ.70 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు తెలిపింది.

Continue Reading

News

బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి

Published

on

కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

సహజీవనానికి వివాహ హోదా లేదు..  సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

Published

on

* సహజీవనం ముగియడం మాత్రమే చట్టపరంగా నేరం కాదు.. వివాహానికి ఉన్న హక్కులు స్వయంచాలకంగా వర్తించవని స్పష్టం

బీబీఎంఏ న్యూస్: న్యూఢిల్లీ

15 ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భాగస్వామి తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) భారత చట్టాల ప్రకారం నేరం కాదని, అయితే అది వివాహంతో సమానమైన చట్టబద్ధ బంధం కూడా కాదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధంలో భాగస్వాములు తమ ఇష్టప్రకారమే కలిసి ఉండవచ్చని, అదే విధంగా విడిపోవచ్చని వ్యాఖ్యానించింది. కేవలం సహజీవనం ముగిసిందనే కారణంతో కోర్టు భాగస్వామిని తిరిగి కలిసి ఉండేలా ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు, వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుందని కూడా న్యాయస్థానం పేర్కొంది. లివ్-ఇన్ సంబంధాలపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన రక్షణలు, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు, పిల్లలకు లభించే హక్కులు వేర్వేరు చట్టాల ప్రకారం పరిశీలించబడతాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

Continue Reading

Trending