News
BBMA POLICE E:NEWS// కమిషనర్కు రాష్ట్రపతి పతకం – ఘన సత్కారం
BBMA POLICE E:NEWS// కమిషనర్కు రాష్ట్రపతి పతకం – ఘన సత్కారం
విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారు విధుల్లో అత్యుత్తమ సేవలకు గాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా “అతి ఉత్కృష్ట సేవా పతకం” అందుకోవడం గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు, శ్రీరాం చిన్నబాబు గారు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, శ్రీరాం కృష్ణ పవన్ గారు కలిసి విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారిని పుష్పగుచ్ఛం, శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపుతున్న నిబద్ధత ఇతరులకు ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
#sreeramTataiah #JaggayyapetaMLA
News
మంథని ఆర్టీసీ బస్టాండ్లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
బిబిఎంఏ న్యూస్ /మంథని:
మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటి సౌకర్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల వరకు బస్టాండ్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం వంటి అంశాలపై పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు తాత్కాలికంగా తాగునీటి ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే, ప్రస్తుతం ఏర్పాటు చేసిన నీటి వ్యవస్థ పరిశుభ్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ పక్కన ఉన్న బోరు నీటిని పైపుల ద్వారా పైభాగంలోని వాటర్ ట్యాంక్కు అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ ట్యాంక్ పూర్తిగా చెత్త, ధూళితో నిండిపోయి ఉండటంతో పాటు ఎలాంటి మూత లేకపోవడం వల్ల కోతులు సైతం అందులోకి చేరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ నీటినే ప్రయాణికులకు తాగునీటిగా అందించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది మాత్రం తమకు మినరల్ వాటర్ తెప్పించుకొని వినియోగిస్తున్నారని, ప్రయాణికులను మాత్రం ఆరోగ్యానికి హానికరమైన నీటికి పరిమితం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కలుషిత నీటితో డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే పరిశుభ్రమైన తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Andhra
కేరళలో కొట్టియూర్ మహాదేవ ఆలయం
స్వయంభూ శివలింగం ఉన్న అపురూప పుణ్యక్షేత్రం…
కొట్టియూర్ మహాదేవ ఆలయం – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయం కలిసిన అపూర్వ పుణ్యక్షేత్రం
బిబిఎంఏన్యూస్ (ప్రత్యేక కథనం)
కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లాలోని సాంద్రమైన అటవీ ప్రాంతంలో, బావలి నది తీరాన నెలకొన్న కొట్టియూర్ మహాదేవ ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన మరియు పుణ్యమైన శైవక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సహజసిద్ధమైన అడవుల మధ్య, నిర్మాణ వైభవానికి దూరంగా, ప్రకృతిని దేవాలయంగా భావించే అరుదైన సంప్రదాయం ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ఈ ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు; ఇది పురాణాల, విశ్వాసాల మరియు సహజ జీవన విధానాల సమ్మేళనం. దక్ష యాగం, సతీదేవి ఆత్మార్పణ వంటి పౌరాణిక ఘటనలతో అనుసంధానమై ఉండటంతో ఈ క్షేత్రాన్ని భక్తులు తరచుగా “దక్షిణ వారణాసి”గా పిలుస్తారు. శివతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చేసే శక్తిక్షేత్రంగా ఇది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ ఆలయ సముదాయం మరో విశిష్టత ఏమిటంటే, ఇది రెండు భాగాలుగా విభజించబడింది. నదికి ఒకవైపు ఏడాది పొడవునా దర్శనమిచ్చే ఇక్కరె కొట్టియూర్, మరోవైపు కేవలం వార్షిక ఉత్సవ సమయంలో మాత్రమే తెరుచుకునే అక్కరె కొట్టియూర్. ఈ తాత్కాలిక ఆలయం ప్రతీ సంవత్సరం ప్రకృతిలోనే నిర్మించబడటం, పండుగ అనంతరం పూర్తిగా తొలగించబడటం ఈ క్షేత్రాన్ని ప్రపంచంలోనే అరుదైన ఆధ్యాత్మిక సంప్రదాయంగా నిలబెడుతుంది.
28 రోజుల పాటు జరిగే వార్షిక వైశాఖ మహోత్సవం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. 2026 మే 29 నుండి జూన్ 24 వరకు జరగనున్న ఈ ఉత్సవం ప్రాచీన వేద యజ్ఞ సంప్రదాయాన్ని జీవంగా ప్రతిబింబిస్తుంది. నెయ్యట్టం ద్వారా ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో, భక్తులు లేత కొబ్బరికాయలతో ఏలనీరట్టం వంటి పవిత్ర ఆచారాల్లో పాల్గొంటారు. ప్రతి ఆచారం శుద్ధి, సమర్పణ, భక్తి అనే మూడు ప్రధాన భావాలను ప్రతిబింబిస్తుంది.
మణితార అనే నదీ రాళ్లపై స్వయంభూ శివలింగం వెలసి ఉండటం ఈ ఆలయానికి మరింత పవిత్రతను కలిగిస్తుంది. ప్రకృతి మధ్య, మానవ నిర్మిత గోడలు లేకుండా జరిగే పూజా విధానాలు భక్తులకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.
సందర్శన పరంగా చూస్తే, కన్నూర్ తలస్సేరి రైల్వే స్టేషన్లు సమీపంలో ఉండగా, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ క్షేత్రానికి ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంది. వర్షాకాలంలో జరిగే ఈ ఉత్సవానికి భారీగా భక్తులు హాజరవుతారు కాబట్టి ముందస్తు ప్రణాళిక, వర్షపు రక్షణ చర్యలు, దీర్ఘ క్యూలకు సిద్ధంగా ఉండటం అవసరం.
ఆధ్యాత్మికతను ప్రకృతితో కలిపే అరుదైన సంప్రదాయం, పురాణాలను జీవంతం చేసే పూజా విధానం, భక్తి భావాన్ని శుద్ధ రూపంలో చూపించే విశిష్టత ఈ అన్ని కారణాల వల్ల కొట్టియూర్ మహాదేవ ఆలయం భారతీయ పుణ్యక్షేత్రాల్లో ఒక అపూర్వ స్థానం సంపాదించింది.
News
బసంత్ నగర్ చెకపోస్ట్ ను సీపీ ఆకస్మిక తనిఖీ
బక్రీద్ నేపథ్యంలో బసంత్ నగర్ టోల్ గేట్ చెక్పోస్ట్ను అర్ధరాత్రి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
బిబిఎంఏ న్యూస్ / బసంత్ నగర్ మే21
బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్ట్ను రామగుండం పోలీస్ కమిషనర్ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంబర్ కిషోర్ ఝా చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
పండుగల సమయంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.
-
crime2 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News1 week agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్లేన్ విస్తరణకు డిమాండ్
-
News4 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
Telangana19 hours agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment2 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime1 week agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
