Telangana
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్
బిబిఎంఏ పోలీస్ న్యూస్ / జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రక్తదానం చేయడం ద్వారా మనం ప్రాణదాతలుగా మారతాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం శరీరానికి ఆరోగ్యదాయకం మాత్రమే కాక సమాజానికి ఉపయుక్తం కూడా అవుతుంది,” అని తెలిపారు.

రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, వివిధ సర్కిళ్ల సి.ఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సుమారు 200 యూనిట్ల రక్తం సేకరించబడిందని రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. ప్రతి సంవత్సరం వారి సంస్మరణలో భాగంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా గౌరవకార్యం,” అని పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిరిసిల్ల శ్రీనివాస్, డాక్టర్ దీపిక, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు, వేణు, సి.ఐలు రామ్ నరసింహ రెడ్డి, రవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్ చివరగా మాట్లాడుతూ, “రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే. ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో భాగమవ్వాలి,” అని పిలుపునిచ్చారు.
Telangana
సైదాపూర్ మండలంలో వర్షానికి పంట నష్టం సహాయక చర్యల్లో అధికారులు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వర్షానికి పంట నష్టం సహాయక చర్యల్లో అధికారులు
బీబీఎంఏ న్యూస్/కరీంనగర్
జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగిపోయి రైతులు ఆందోళనకు గురయ్యారు. సైదాపూర్ మోడల్ స్కూల్ కూడా వర్షపు నీటితో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఎంపీడీఓ బి యాదగిరి తాసిల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్థుల సహకారంతో నీటిని బయటకు తరలించే చర్యలు చేపట్టారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తూ రైతులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. (more…)
Telangana
రాష్ట్రీయ ఏకతా దివస్” కార్యక్రమం పై చర్చ : ఎంపీ ఈటెల
- మాజీ ప్రధాని వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు..
బిబిఎంఏ న్యూస్ /శామీర్పేట్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,
భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రాష్ట్రీయ ఏకతా దివస్” కార్యక్రమాల భాగంగా యూనిటీ రన్, వివిధ
కార్యక్రమాలపై చర్చించేందుకు శామీర్పేట్లోని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ క్యాంప్ కార్యాలయం (నివాసం)లో విలేకరుల సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జాతీయ ఏకతా, ఐకమత్యం, సామరస్యానికి సర్దార్ పటేల్ జీవితం ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రజలందరూ ఆయన చూపిన మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
Andrapradhesh
యాదగిరిగుట్ట దేవాలయ ఇంజనీరు లంచం కేసులో ఏసీబీ వలలో వూడెపు వెంకట రామారావు
యాదగిరిగుట్ట దేవాలయ ఇంజనీరు లంచం కేసులో ఏసీబీ వలలో వూడెపు వెంకట రామారావు

యాదగిరిగుట్ట దేవాలయ ఇంజనీరు లంచం కేసులో ఏసీబీ వలలో వూడెపు వెంకట రామారావు
బిబిఎంఏ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ /యాదగిరిగుట్ట
అక్టోబర్ 30 :
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లంచం వ్యవహారం బహిర్గతం అయింది.
ఆలయంలో ఆహార యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన రూ.11,50,445/- బిల్లు మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుదారుని నుండి రూ.1,90,000/- లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇంచార్జి సూపరింటెండింగ్ ఇంజనీరు, ఆలయ సహాయక ఇంజనీరు వూడెపు వెంకట రామారావు ను తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు రంగేహస్తంగా పట్టుకున్నారు.
ట్రాప్ సమయంలో లంచం మొత్తం స్వాధీనం చేసుకొని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది –
“ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన పక్షంలో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కి కాల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.”
ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
-
Police News5 days agoకమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞల కొనసాగింపు : సీపీ అంబర్ కిషోర్ ఝా
-
diwali3 weeks ago🪔✨ దీపావళి శుభాకాంక్షలు — BBMA News నుండి మీకు మనస్ఫూర్తిగా! ✨🪔
-
Andrapradhesh5 days ago20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు
-
Andrapradhesh1 week agoతుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతం
-
india3 weeks agoజాతీయ పోలీస్ స్మారక దినోత్సవం: దేశ భద్రతకు ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళి
-
Police News1 week agoపోలీసు అమరవీరుల దినోత్సవం
-
Telangana1 week ago
రాష్ట్రీయ ఏకతా దివస్” కార్యక్రమం పై చర్చ : ఎంపీ ఈటెల
-
india1 week agoమావోయిస్టుల ‘గోల్డ్ నెట్వర్క్’పై NIA కంటగత్తి
